ఆంధ్రప్రదేశ్

andhra pradesh

SUICIDE ఆర్థిక సమస్యలతో విద్యార్థిని ఆత్మహత్య

By

Published : Jul 28, 2022, 11:00 AM IST

Updated : Jul 30, 2022, 9:18 AM IST

student sucide

10:57 July 28

బ్యాంకు అధికారులు ఇంటికి రావడంతో విద్యార్థిని మనస్తాపం

ఎన్టీఆర్‌ జిల్లా నందిగామలో విషాదం చోటు చేసుకుంది. రైతుపేటలో జాస్తి హరిత వర్షిణి విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. వర్షిణి ఈఏపీసెట్‌లో 15 వేల ర్యాంకు సాధించింది. బాలిక తండ్రి ప్రభాకర్‌రావు దిల్లీలో ప్రైవేటు కంపెనీలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు. కుమార్తె చదువు కోసం తండ్రి ప్రభాకర్‌రావు... రెండేళ్ల క్రితం కరోనా సమయంలో విజయవాడలోని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ద్వారా క్రెడిట్‌ కార్డుపై మూడున్నర లక్షల రుణం తీసుకున్నాడు. ఇటీవల బ్యాంకు అధికారులు ఇంటివద్దకు అప్పు చెల్లించాల్సిందిగా ఒత్తిడి చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తండ్రిని అరెస్ట్ చేస్తారన్న ఆందోళనతో వర్షిణి బలవన్మరణానికి పాల్పడినట్లు చెప్పారు. మృతురాలి వద్ద లభించిన సూసైడ్‌ లేఖ ఆధారంగా, బాలిక తల్లి అరుణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నందిగామ సీఐ కనకారావు తెలిపారు.

ఇవీ చదవండి:

Last Updated :Jul 30, 2022, 9:18 AM IST

ABOUT THE AUTHOR

...view details