కర్నూలు జిల్లా నంద్యాలలో తిరువీధి వెంకటసుబ్బయ్య (70) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పట్టణంలోని బాలాజీ కాంప్లెక్స్లో టీ దుకాణం వద్ద ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు అతన్ని కత్తితో దాడి చేసి హతమార్చారు. ఈ దాడిలో మరో వ్యక్తికి గాయపడ్డాడు. వెంకట సుబ్బయ్య చిరు వ్యాపారుల సంఘం అధ్యక్షుడిగా ఉన్నాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.