ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఈ నెల 27న భారత్​ బంద్​కు వైకాపా, తెదేపాలు కలిసి రావాలి: రామకృష్ణ

By

Published : Sep 15, 2021, 4:40 PM IST

ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరణ చెయ్యడాన్ని నిరసిస్తూ ఈనెల 21 విశాఖలో భారీ ర్యాలీ చేపడుతున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. ఈనెల 27న జరిగే భారత్​ బంద్​లో అధికార, ప్రతిపక్ష పార్టీలైన వైకాపా, తెలుగుదేశం పార్టీలు పాల్గొనాలని ఆయన కోరారు.

cpicpi
సీపీఐ

ఈ నెల 27న రైతు సంఘాల ఆధ్వర్యంలో చేపట్టబోయే భారత్​ బంద్ విజయవంతం చేయాలని సీపీఐ కర్నూలులో భారీ ర్యాలీ చేపట్టింది. నగరంలోని బళ్లారి చౌరస్తా నుండి కలెక్టర్ కార్యాలయం వరకు సాగిన ఈ ర్యాలీలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేవేటీకరణ చెయ్యడాన్ని నిరసిస్తూ ఈనెల 21 విశాఖలో భారీ ర్యాలీ చేపడుతున్నట్లు రామకృష్ణ తెలిపారు. ఈనెల 27న జరిగే భారత్​ బంద్​లో అధికార, ప్రతిపక్ష పార్టీలైన వైకాపా, తెలుగుదేశం పార్టీలు పాల్గొనాలని ఆయన కోరారు.

ABOUT THE AUTHOR

...view details