ఆయేషా మీరా కేసు(Ayesha Meera Case)లో అనుమానితులకు నార్కో పరీక్షల (cbi plea to conduct narco analysis test news)పై విజయవాడ కోర్టు విచారణ జరిపింది. సీబీఐ వేసిన పిటిషన్ను న్యాయస్థానం కొట్టివేసింది. నార్కో పరీక్షలకు అనుమతించాలంటూ గతంలో కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) వ్యాజ్యం దాఖలు చేసింది.
15:55 September 22
Ayesha Meera Case updates
అయేషా మీరా కేసు.. ఏం జరిగింది
అయేషామీరాపై అత్యాచారం((Ayesha Meera Case)), హత్య ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. హత్యాచారానికి కారకులెవరో తేల్చాలన్న హైకోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగింది సీబీఐ(CBI). గతంలో ఆధారాలు ధ్వంసం కావడంతో రీ పోస్టుమార్టం నిర్వహించింది. తొలుత బాధిత కుటుంబం, ముస్లిం మతపెద్దల వ్యతిరేకతతో విజయవాడ నాలుగో అదనపు చీఫ్ మెట్రోపాలిటిన్ మహిళా కోర్టు నుంచి సీబీఐ అనుమతి పొందింది. గుంటూరు జిల్లా తెనాలి చెంచుపేటలోని శ్మశానవాటికలో.. అయేషామీరా సమాధిని అధికారులకు ఆమె తండ్రి చూపించారు. ముస్లిం మతపెద్దల సమక్షంలో ఆ ప్రదేశాన్ని తవ్వారు. రీ పోస్ట్మార్టం ప్రక్రియను చేపట్టారు. అయితే ఈ కేసులో అనుమానితులకు నార్కో పరీక్షలు నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలంటూ సీబీఐ.. కోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు వ్యాజ్యాన్ని దాఖలు చేసింది. అయితే దీనిపై విచారించిన కోర్టు.. అనుమతికి నిరాకరిస్తూ పిటిషన్ను కొట్టివేసింది.
ఇదీ చదవండి
CMRF Scam: ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీలో కుంభకోణం..!