CMRF Scam: ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీలో కుంభకోణం..!

author img

By

Published : Sep 22, 2021, 1:25 PM IST

Updated : Sep 22, 2021, 3:52 PM IST

scam in cmrf cheques distribution

13:22 September 22

సచివాలయంలోని కొందరు ఉద్యోగుల పాత్రను గుర్తించిన అనిశా

ముఖ్యమంత్రి సహాయనిధి(సీఎంఆర్‌ఎఫ్‌) చెక్కుల పంపిణీ కుంభకోణంలో మరికొందరి ప్రమేయం ఉందని అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) తేల్చింది. ఏపీ సచివాలయంలోని కొందరి ఉద్యోగుల పాత్రను ఏసీబీ గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో రూ.117 కోట్లు పక్కదారి పట్టించేందుకు ప్రయత్నించారని ఏసీబీ అధికారులు గతంలోనే గుర్తించారు. దీనికి సంబంధించి గతేడాది సెప్టెంబర్‌లో ఈ కేసు నమోదైంది. కాగా, ఈ కుంభకోణంలో మరికొందరి పాత్ర ఉన్నట్లు.. ఆస్పత్రుల నుంచి సేకరించిన సమాచారంతో నిధులు స్వాహా చేసినట్లు తాజాగా గుర్తించారు. ప్రజాప్రతినిధుల పీఏలు, అనుచరుల ప్రమేయం ఉన్నట్లు ఏసీబీ తేల్చినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో సుమారు 50 మంది ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే పలువురిని అరెస్టు చేశారు. 

Last Updated :Sep 22, 2021, 3:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.