YSRCP Government Not Giving Tarpaulin to Farmers :యంత్రాలతో కోసిన ధాన్యాన్ని ఆరబెట్టాలంటే రైతులకు ఎక్కడా ప్లాట్ఫాంలు లేవు. ఎకరాకు 3 లక్షల పెట్టుబడి పెట్టే మిరప పరిస్థితీ అంతే. రహదారులపైకో, ఖాళీగా ఉన్న పొలాల్లోకో వెళ్లాల్సిందే. ప్రభుత్వం చెబుతున్నట్లు ధాన్యాన్ని 17 శాతం తేమ స్థాయికి తేవాలంటే కనీసం వారం నుంచి పది రోజులు ఆరబెట్టాలి. ఒక్కో బరకాకు అద్దె రోజుకు 30 నుంచి 40 రూపాయల వరకు ఉంటుంది. ఎకరంలో ధాన్యం ఆరబెట్టాలంటే కనీసం అయిదు బరకాలు కావాలి. అంటే రోజుకు 150 రూపాయలు అలా వారం పాటు ఆరబెట్టడానికి 1,050 ఖర్చవుతుంది. ఎకరా పొలంలో పండే ధాన్యాన్ని తడవకుండా కాపాడుకోవాలంటే 10 వేల ఖర్చుతో టార్పాలిన్ కొనాలి. కల్లాల్లో ఆరబెట్టిన మిరప కాపాడుకోవాలన్నా, భారీ వర్షం నుంచి ధాన్యం రాశుల్ని కాపాడుకోవాలన్నా టార్పాలిన్లు కావాల్సిందే. అందుకే రైతులు వీటిని తీసుకునేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తారు.
Farmers Problems with Michaung Cyclone :అప్పులు జేసి అప్పటికే పలురకాలుగా పెట్టుబడి పెట్టే రైతు చివరి దశలో బరకాలను కొనలేకనే ప్లాస్టిక్ గోతాలతో చేసిన పరదా పట్టాల్ని కప్పి పంటను రక్షించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయినా వర్షపు నీరు ఆగడం లేదు. రాశులు, మిరప కుప్పల కిందకు నీరు చేరుతోంది. ఫలితంగా రైతులు ఏటా పెద్ద ఎత్తున నష్టపోతున్నారు. తాజాగా మిగ్జాం తుపాను (Michaung Cyclone) ధాటికి కుదేలయ్యారు. కొన్నిచోట్ల ధాన్యం, మిరప నీటిలో తేలియాడే పరిస్థితి ఉంది. ఒకేసారి అవసరమయ్యే సరికి డిమాండ్ పెరిగి బరకాలు అద్దెకు కూడా దొరకడం లేదని రైతులు చెబుతున్నారు.
కరవు నష్టం కొండంత - ప్రభుత్వ సాయం గోరంత! 'నలిగిపోతున్న రాష్ట్ర రైతులు'
Michaung Cyclone in AP :ఆరుగాలం శ్రమించే అన్నదాతకు పంట చేతికొచ్చే సమయంలోఅకాల వర్షాలను తట్టుకోవడం పెద్ద సవాలుగా మారింది. ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ముందస్తు సన్నద్ధత ఒక్కటే మార్గం. ముఖ్యంగా వారికి టార్పాలిన్లు అందిస్తే ధాన్యం, మిరప లాంటి వాటిని వర్షాల నుంచి రక్షించుకోవచ్చు. 59 వేల కోట్ల రూపాయలతో ధాన్యం కొనుగోలు చేశామని గొప్పలు చెప్పే జగన్ 200 కోట్లు ఖర్చు పెట్టి రైతులకు టార్పాలిన్లు ఇచ్చేందుకు మాత్రం ససేమిరా అంటున్నారు.