ఆంధ్రప్రదేశ్

andhra pradesh

బొప్పూడి వద్ద రోడ్డు ప్రమాదం..ఇద్దరికి గాయాలు

By

Published : Mar 26, 2021, 8:39 PM IST

చిలకలూరిపేట మండలం బొప్పూడి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రీకొడుకులకు తీవ్రగాయాలయ్యాయి. లారీలో నుంచి ఇనుప గడ్డర్ కింద పడడంతో ఈ ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని చిలకలూరిపేటలోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు.

గాయపడిన ఇద్దరిని ఆస్పత్రికి తరలిస్తున్న 108 సిబ్బంది
గాయపడిన ఇద్దరిని ఆస్పత్రికి తరలిస్తున్న 108 సిబ్బంది

గాయపడిన ఇద్దరిని ఆస్పత్రికి తరలిస్తున్న 108 సిబ్బంది

గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం బొప్పూడి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రీకుమారుడు తీవ్రంగా గాయపడ్డారు. ద్విచక్ర వాహనంపై చిలకలూరిపేట వెళ్తున్న కట్టెబోయిన రామయ్య, భానుగోపిపై... బొప్పూడి వైపు వెళ్తున్న లారీలోని ఇనుప గడ్డర్‌ జారీ పడింది. ఘటనలో రామయ్య తలకు తీవ్ర గాయంకాగా అపస్మారక స్థితిలోకి వెళ్లాడు‌. అతని కుమారుడు భాను కూడా తీవ్రంగా గాయపడగా..ఇద్దరినీ చిలకలూరిపేట ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఇదీ చదవండి: గుంటూరు జిల్లాలో ప్రశాంతంగా భారత్ బంద్

ABOUT THE AUTHOR

...view details