ఆంధ్రప్రదేశ్

andhra pradesh

గుంటూరులో రైల్వే ఉద్యోగుల జన ఆందోళన్ ప్రచారం

By

Published : Oct 9, 2020, 11:46 AM IST

కరోనా పట్ల ప్రజలు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధాని మోదీ జనఆందోళన్ ప్రచారానికి పిలుపునిచ్చారు. దీనిలో భాగంగా... కరోనా నివారణపై అవగాహన పెంచుతూ గుంటూరు రైల్ వికాస భవన్​లో రైల్వే ఉద్యోగులు ప్రమాణం చేశారు.

RAILWAY EMPLOYEES JANA ANDOLAN COMPAIGN IN GUNTUR
గుంటూరులో రైల్వే ఉద్యోగుల జనఆందోళన్ ప్రచారం

జన ఆందోళన్ ప్రచారంలో భాగంగా... కరోనా నివారణపై అవగాహన పెంచుతూ గుంటూరు రైల్ వికాస భవన్​లో రైల్వే ఉద్యోగులు ప్రమాణం నిర్వహించారు. రానున్న రోజుల్లో పర్వదినాలు, చలికాలం వస్తున్నందున కరోనా పట్ల ప్రజలు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలనే లక్ష్యంతో ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా జన ఆందోళన్ ప్రచారానికి పిలుపునిచ్చారు.

గుంటూరు ఏడీఆర్ఎం శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పలువురు రైల్వే ఉద్యోగులు పాల్గొన్నారు. రైల్వే అధికారులు, ఉద్యోగులు జాగ్రత్తలు పాటించాలని.... ప్రయాణికులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ఏడీఆర్ఎం శ్రీనివాస్ కోరారు.

ఇదీ చదవండి:'రాష్ట్రీయ కృషి వికాస్ యోజనతో రైతులకు మేలు'

ABOUT THE AUTHOR

...view details