Stone Lift Competition: గుంటూరు జిల్లాలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. సంక్రాంతి పండగ సందర్భంగా.. పిరంగిపురం మండలం వేములురిపాడులో నిర్వహించిన తొమ్మిదో జాతీయ స్థాయి 102 కేజీల గుండు రాయి ఎత్తే పోటీలు అలరించాయి. పోటీదారులు గుండురాయిని ఎత్తి అలరించారు.
నరసరావుపేట మండలం పమిదిపాడు గ్రామానికి చెందిన మదా వీరాంజనేయులు.. 5 నిమిషాల్లో 30 సార్లు గుండు రాయిని పైకెత్తి ప్రథమ స్థానంలో నిలిచాడు. మాచవరం మండలం పిన్నెల్లి గ్రామానికి చెందిన శోభన్ 28 సార్లు, పిన్నెల్లికి చెందిన రామాంజనేయులు 27 సార్లు పైకెత్తి రెండు, మూడవ స్థానాల్లో నిలిచారు. పోటీలను చూడడానికి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు భారీగా తరలివచ్చారు.
ఇదీ చదవండి
Last Updated :Jan 15, 2022, 1:43 PM IST