ఆంధ్రప్రదేశ్

andhra pradesh

బిడ్డింగ్ విధానంలో వైద్య నిపుణుల్ని నియమిస్తున్నాం: మంత్రి రజనీ

By

Published : Jan 21, 2023, 9:51 AM IST

MINISTER VIDADALA RAJINI

MINISTER VIDADALA RAJINI : నెలకు మూడు లక్షల రూపాయల కంటే ఎక్కువ వేతనం చెల్లించేలా.. బిడ్డింగ్ విధానంలో వైద్య నిపుణుల్ని రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తోందని.. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని అన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి బోధనాసుపత్రుల వరకు సిబ్బంది కొరత లేకుండా చూస్తున్నట్టు వెల్లడించారు.

MINISTER VIDADALA RAJINI : ఫ్యామిలీ ఫిజిషియన్‌ వైద్య విధానం అమల్లో భాగంగా వైద్యులు అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలను తప్పకుండా సందర్శించాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజిని ఆదేశించారు. ఈ పథకం విస్తరణలో భాగంగా త్వరలో 260 అంబులెన్సులు అందుబాటులోనికి రాబోతున్నాయని తెలిపారు. శుక్రవారం మంగళగిరిలోని వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.

నెలకు వేతనం కింద రూ.3 లక్షల వరకు వైద్యులకు ‘బిడ్డింగ్‌’ విధానంలో చెల్లించే విధానం చేపట్టడం వల్ల మారుమూల ప్రాంతాల్లో సైతం వైద్య సేవలు మెరుగుపడుతున్నాయని అన్నారు. డైట్‌ ఛార్జీలను రూ.40 నుంచి రూ.80కి పెంచినందున రోగులకు నాణ్యమైన భోజనం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నూతన ప్రభుత్వ వైద్య కళాశాలలకు అనుమతులు ఇచ్చే ప్రక్రియలో భాగంగా త్వరలో జాతీయ వైద్య బృందాలు తనిఖీలకు రానున్నట్లు తెలిపారు.

విజయవాడలోని సెంట్రల్‌ డ్రగ్‌ టెస్టింగ్‌ ల్యాబరేటరీని వినియోగంలోనికి తెచ్చేందుకు వీలుగా చర్యలు చేపట్టాలని సూచించారు. ఆరోగ్యశ్రీ అనుబంధ ఆసుపత్రులకు బిల్లులు చెల్లించే సమయంలో రోగుల నుంచి అభిప్రాయాలు సేకరించే ఎ.ఎన్‌.ఎం. అభిప్రాయాలు పరిగణనలోనికి తీసుకోవాలని నిర్దేశించారు. అన్ని ఆసుపత్రుల్లో కియోస్కులు ఏర్పాటు చేయాలని అన్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details