ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అమరావతి రైతులకు కౌలు చెల్లించకపోవడంపై హైకోర్టులో విచారణ - తీర్పు రిజర్వ్

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 15, 2023, 10:24 PM IST

High Court Reserved Judgment on Amaravati Tenant Farmers Petition: రాజధాని అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులకు సకాలంలో కౌలు చెల్లించకపోవడంపై రైతులు దాఖలు చేసిన పిటిషన్​పై హైకోర్టు విచారణ జరిపింది. ఇరువైపులా వాదనలు పూర్తి కావడంతో న్యాయమూర్తి తీర్పును రిజర్వ్​లో ఉంచారు.

High_Court_Reserved_Judgment_on_Amaravati_Tenant_Farmers_Petition
High_Court_Reserved_Judgment_on_Amaravati_Tenant_Farmers_Petition

High Court Reserved Judgment on Amaravati Tenant Farmers Petition : రాజధాని కోసం భూములిచ్చిన వారికి వార్షిక కౌలు చెల్లించటంలో రాష్ట్ర ప్రభుత్వం, సీఆర్‌డీఏ (CRDA)లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని రైతుల తరఫున సీనియర్‌ న్యాయవాది ఉన్నం మురళీధరరావు (Unnam Muralidhara Rao) హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. రైతులకు ప్రభుత్వం వార్షిక కౌలు చెల్లించకపోవటాన్ని ప్రశ్నిస్తూ "అమరావతి రాజధాని సమీకరణ రైతు సమాఖ్య" సంయుక్త కార్యదర్శి కల్లం రాజశేఖర్‌రెడ్డి, "రాజధాని రైతు పరిరక్షణ సమితి" సంయుక్త కార్యదర్శి ధనేకుల రామారావులు హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం రాజధాని రైతులకు కౌలు చెల్లించటంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. కడపకు చెందిన న్యాయవాది బైరెడ్డి సాయిఈశ్వర్‌రెడ్డి (Byreddy Sai Eswar Reddy) ఈ వ్యాజ్యంలో అనుబంధ పిటిషన్‌ వేశారు. తనను ప్రతివాదిగా చేర్చుకోవాలని ఇంప్లీడ్‌ గతంలో దాఖలు చేసిన విషయం తెలిసిందే.

Amaravati Tenant Farmers Petition Updates : రైతులు దాఖలు చేసిన పిటిషన్​పై నేడు విచారణ : రాజధాని అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులకు సకాలంలో కౌలు చెల్లించకపోవడంపై రైతులు దాఖలు చేసిన పిటిషన్​పై ఈరోజు హైకోర్టు విచారణ జరిపింది. రైతుల తరపున సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధరరావు వాదనలు వినిపించారు. అమరావతి రాజధాని సమీకరణ రైతు సమాఖ్య, రాజధాని రైతు పరిరక్షణ సమితి పిటిషన్లు దాఖలు చేశాయి. ఇరువైపులా వాదనలు పూర్తి కావడంతో న్యాయమూర్తి తీర్పును రిజర్వులో ఉంచారు.

High Court Hearing on Payment of Rent to Farmers :రైతులు సొసైటీల పేరుతో పిటిషన్లు దాఖలు చేయడంపై సీఆర్​డీఏ తరపు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజధాని అమరావతి కోసం భూములు ఇచ్చిన చిన్న, సన్న కారు రైతుల సంఖ్య, వివరాలను రైతుల తరపు న్యాయవాదిని న్యాయమూర్తి అడిగి తెలుసుకున్నారు. 28,720 మంది రైతులు 34,396.96 ఎకరాలు ఇచ్చారని న్యాయవాది తెలిపారు. వీరిలో ఎకరా లోపు 20,176 మంది రైతులు ఉన్నట్లు కోర్టుకు తెలిపారు. 1 ఎకరా నుండి 2 ఎకరాల్లోపు వున్న రైతులు 4,217 మంది ఉన్నారని న్యాయవాది హైకోర్టుకు ఉన్నం మురళీధరరావు తెలిపారు.

AP High Court Hearing on Payment of Rent to Capital Farmers: 'రాజధాని రైతుల కౌలు చెల్లింపు'... హైకోర్టులో విచారణ ఈ నెల 30కి వాయిదా

High Court Hearing Capital Farmers Petition : గతంలో వివేకానంద విరూపాక్ష వాదనలు : ఇంప్లీడ్‌ పిటిషనర్‌ తరఫున న్యాయవాది వివేకానంద విరూపాక్ష వాదనలు వినిపించారు. సీఆర్‌డీఏచట్ట నిబంధనల మేరకు భూసమీకరణ పథకానికి శాసనసభ ఆమోదం తెలపలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి రైతులకు వార్షిక కౌలు చెల్లింపు చట్ట విరుద్ధం అన్నారు. సీఆర్‌డీఏ డెవలప్‌మెంట్‌ ఫండ్‌ నుంచి మాత్రమే కౌలు చెల్లించాల్సి ఉందన్నారు. పిటిషనర్‌ ట్యాక్స్‌ పేయర్‌ అని, ఆయన చెల్లించే సొమ్మును చట్ట నిబంధనలకు అనుగుణంగా ఖర్చు చేయకపోతే ప్రశ్నించే హక్కు ఉంటుందన్నారు.

గతంలో ఉన్నం మురళీధరరావు వాదనలు :రైతుల తరఫున సీనియర్‌ న్యాయవాది ఉన్నం మురళీధరరావు వాదనలు వినిపించారు. ఇంప్లీడ్‌ పిటిషన్‌కు విచారణ అర్హత లేదన్నారు. కౌలు చెల్లింపు విషయం రైతులకు, సీఆర్‌డీఏ మధ్య వ్యవహారం అన్నారు. ఏటా మే 1లోపు వార్షిక కౌలు చెల్లించాల్సిన చట్టబద్ధ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం, సీఆర్‌డీఏపై ఉందన్నారు. ఇప్పటి వరకు కౌలు చెల్లించలేదన్నారు. భూములిచ్చిన వారి చట్టబద్ధ హక్కులను అమలు చేయాలని రైతులు కోరుతున్నారన్నారు.

Amaravati Farmers Land Rent Funds Delayed: రాజధాని రైతులకు తప్పని కన్నీటి వెతలు.. ప్రభుత్వ నిర్వాకంతో చుట్టుమడుతున్న ఆర్థిక కష్టాలు

సొమ్ము విడుదల చేయాలని సీఆర్‌డీఏ కమిషనర్‌.. ప్రభుత్వానికి లేఖ రాశారని గుర్తు చేశారు. కౌలు చెల్లింపు కోసం బడ్జెట్‌ విడుదల చేసినప్పటికీ రైతుల ఖాతాల్లో పురపాలక శాఖ జమ చేయలేదన్నారు. గత తొమ్మిదేళ్లుగా రైతులకు కౌలు చెల్లిస్తున్నారన్నారు. సొమ్ము చెల్లింపులో మరింత జాప్యం చేయాలన్న రాజకీయ దురుద్దేశంతో ఇంప్లీడ్‌ పిటిషన్‌ వేశారన్నారు. తాము దాఖలు చేసిన పిటిషన్‌పై సీఆర్‌డీఏ అభ్యంతరం లేవనెత్తుతున్న నేపథ్యంలో తొలుత ఆ విషయాన్ని తేల్చాలన్నారు. న్యాయమూర్తి స్పందిస్తూ ఇంప్లీడ్‌ పిటిషన్‌పై కౌంటర్‌ వేయాలని పేర్కొంటూ విచారణను వాయిదా వేశారు. దీంతో రైతుల తరఫున సీనియర్‌ న్యాయవాది తీవ్ర అభ్యంతరం తెలిపారు. కౌలు అందక రైతులు ఆకలితో అలమటిస్తున్నారన్నారు.

capital farmers Mahadharna: 'భూముల కౌలు ఇవ్వరా.. బుద్ధి చెప్తాం' రాజధాని రైతుల మహాధర్నా

TAGGED:

ABOUT THE AUTHOR

...view details