ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఇరువర్గాల మధ్య ఘర్షణ... ఇద్దరికి గాయాలు

By

Published : Apr 8, 2021, 1:59 PM IST

గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం రాజుపాలెంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.

injured people
దాడిలో గాయపడిన ఇద్దరు వ్యక్తులు

గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం రాజుపాలెంలో కమ్మ మల్లిఖార్జునరావు, నెప్పలి సాంబయ్య వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఓటు వేసేందుకు వెళ్లిన సమయంలో వివాదం చెలరేగి.. ఒకరిపై మరొకరు దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో సాంబయ్య, ప్రకాశ్​ అనే వ్యక్తుల తలలకు గాయాలయ్యాయి. రక్తంతో చొక్కాలు తడిసిపోయాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గొడవ సద్దుమణిగేలా చేశారు. క్షతగాత్రులను బాపట్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details