ఆంధ్రప్రదేశ్

andhra pradesh

"మంత్రి మేరుగ నాగార్జున మా బిల్లులు రాకుండా అడ్డుకుంటున్నారు" .. మాజీ సర్పంచ్ ఆరోపణ

By

Published : Feb 5, 2023, 12:32 PM IST

Former Sarpanch of Moolpur

Minister Meruga Nagarjuna: గ్రామాభివృద్దికి సంబంధించిన బిల్లులు రాకుండా మంత్రి మేరుగ నాగార్జున అడ్డుకుంటున్నారని బాపట్ల జిల్లా అమర్తలూరు మండలం మూల్పూరు మాజి సర్పంచ్ రోజామేరీ భర్త మాణిక్యాల రావు ఆరోపించారు. కోట్ల రూపాయలతో పంచాయతీ అభివృద్ధి చేశాము.. కాని 14వ ఆర్థిక సంఘం నిధులలో తమకు రావాల్సిన బిల్లులు రానివ్వడం లేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

Minister Meruga Nagarjuna: గ్రామాభివృద్దికి సంబంధించిన బిల్లులు రాకుండా మంత్రి మేరుగ నాగార్జున అడ్డుకుంటున్నారని బాపట్ల జిల్లా అమర్తలూరు మండలం మూల్పూరు మాజి సర్పంచ్ రోజామేరీ భర్త మాణిక్యాల రావు ఆరోపించారు. 2013-18 వరకు రోజామేరీ సర్పంచ్​గా పనిచేశారు. ఆ సమయంలో కోట్ల రూపాయలతో పంచాయతీ అభివృద్ధి చేశామని మాణిక్యరావు చెబుతున్నారు. అయితే 14వ ఆర్థిక సంఘం నిధులలో తమకు రావాల్సిన బిల్లులు రాకుండా స్థానిక నాయకుల మాటలు విని మంత్రి మేరుగ నాగార్జున బిల్లులు రానివ్వడం లేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

జిల్లా అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఎలాంటి ఉపయోగం లేదని వాపోతున్నారు. స్థానిక నాయకుల చేతిలో కీలుబొమ్మగా మారి మంత్రి నాగార్జున దళితులను వేధిస్తున్నారని మండిపడ్డారు. తన ఆవేదనను చెప్పుకుంటున్నందుకు... కొందరు చంపేస్తామని బెదిరింపులు చెయ్యడం దారుణమన్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details