విధి నిర్వహణలో భాగంగా.. విత్తన ప్రాసెసింగ్ కేంద్రాన్ని తనిఖీ చేయడానికి ఓ అధికారి వెళ్లారు. అయితే.. సదరు అధికారితో వైకాపా నాయకుడు గొడవకు దిగడం గమనార్హం. అధికార పార్టీ నేతలకు సమాచారం ఇవ్వకుండా తనిఖీలకు వెళ్లడమే ఆయన చేసిన తప్పట! తమకు చెప్పకుండా సోదాలకు ఎలా వస్తారని ఆయన ప్రశ్నించారు.
అనంతపురం జిల్లా బెలుగుప్ప జేడీఏ చంద్ర నాయక్ ఈ పరిస్థితిని ఎదుర్కొన్నారు. బెలుగుప్పలోని వినాయక పప్పు, శనగ విత్తన ప్రాసెసింగ్ కేంద్రాన్ని జేడీఏ చంద్ర నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేసేందుకు వెళ్లారు. అయితే.. తమకు సమాచారం ఇవ్వకుండా అధికారి తనిఖీలకు రావడం సరికాదంటూ.. వైకాపా మండల కన్వీనర్ సదరు అధికారిని నిలదీయడం చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
ఇదీ చదవండి:యువతులు, మహిళలే టార్గెట్.. మాయమాటలు చెప్పి