ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కొడవలితో మహిళ హల్‌చల్‌.. పింఛన్​ కోసం బెదిరింపు

By

Published : Nov 12, 2019, 10:17 AM IST

అనంతపురం జిల్లా ఇప్పేరు పంచాయతీ కార్యాలయంలో మహిళ హల్‌చల్‌ చేసింది. పింఛన్‌ ఇవ్వకపోతే చంపేస్తానని పంచాయతీ  కార్యదర్శిని బెదిరించింది.

women-halchal

స్పందన కార్యక్రమంలో కొడవలితో మహిళ హల్‌చల్‌

అనంతపురం జిల్లా కూడేరు మండలం ఇప్పేరు గ్రామంలో ఓ మహిళ హల్‌చల్‌ చేసింది. పంచాయతీ కార్యాలయంలో నిన్న జరిగిన స్పందన కార్యక్రమంలో పింఛన్‌ ఇవ్వకపోతే చంపేస్తానని శివమ్మ అనే మహిళ కొడవలితో బెదిరించింది. మరికొందరు పింఛన్‌ రాకపోతే పెట్రోల్ పోసి హతమారుస్తామని పంచాయతీ కార్యదర్శి మురళీకృష్ణను హడలెత్తించారు. కార్యాలయ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వటంతో ఘటనాస్థలానికి చేరుకుని పెన్నోబులేశు, శివమ్మను అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరినీ అనర్హులుగా తేల్చి పింఛన్లు నిలిపివేయటంతో వారు ఈ విధంగా వీరంగం సృష్టించారు.

Contributor : B. Yerriswamy Center : uravakonda, ananthapuram (D) Date : 12-11-2019 Sluge : ap_atp_71a_12_mahila_halchal_av_AP10097 Cell : 9704532806 అనంతపురం జిల్లా, ఉరవకొండ నియోజకవర్గం. కూడేరు మండలం. పెట్రోల్, కొడవళ్ళతో పంచాయతీ కార్యాలయంలో హల్చల్. అధికారులను బెదిరింపులు. పింఛన్ రాలేదో పెట్రోల్ పోసి చంపుతాం అని కొందరు వ్యక్తులు బెదిరించిన ఘటన కూడేరు మండల కేంద్రంలో నిన్న మధ్యాహ్నం చోటుచేసుకుంది. ఇప్పేరు గ్రామంలో జరిగిన స్పందన కార్యక్రమంలో ఒక మహిళ వేట కొడవలితో హల్ చల్ చేసింది. పింఛన్ రాలేదో పెట్రోల్ పోసి చంపుతాం, అంటూ అధికారులను బెదిరించిన ఘటన కూడేరు మండలం ఇప్పేరు గ్రామంలో సోమవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. వచ్చే నెల పింఛన్ రాలేదో పెట్రోల్ పోసి చంపుతాం అంటూ కొందరు వ్యక్తులు అధికారులను బెదిరించారు. ఇప్పేరు గ్రామానికి చెందిన పేన్నోబులేశు, శివమ్మ,నారాయణ మరో నలుగురు వ్యక్తులు కార్యాలయానికి వెళ్లి నవంబర్ నెల పింఛను ఇవ్వాలని పంచాయతీ కార్యదర్శి మురళీకృష్ణను కోరారు. ఇప్పుడు ఇవ్వడానికి లేదు ఫిర్యాదులు వచ్చాయి వచ్చే నెల ఇస్తాం అని ఆయన సమాధానం ఇచ్చాడు. దీంతో వచ్చే నెల పింఛన్ రాలేదో పెట్రోల్ పోసి చంపుతామని బెదిరించారు. అక్కడ ఉన్న వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి చేరుకొని పేన్నోబులేశు, శివమ్మ మరో వ్యక్తిని పోలీసులు స్టేషన్ కు తరలించారు. శివమ్మ చేతిలో కొడవలి ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వీరు మత్సకారుల పింఛన్లు పొందుతున్నారు, అనర్హులుగా పిర్యాదులు రావడంతో పింఛన్లు నిలిపివేశారు. దింతో ఈ విదంగా వీరంగం సృష్టించారు.

ABOUT THE AUTHOR

...view details