ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తోంది'

By

Published : Jun 14, 2020, 10:49 PM IST

రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తోందని తెలుగుదేశం నేత ఉమామహేశ్వర నాయుడు ఆరోపించారు. కళ్యాణదుర్గం ఎన్టీఆర్ భవన్ ముందు కాగడాల ప్రదర్శన చేపట్టిన ఆయన తెదేపా నేతల అరెస్టులను ఖండించారు.

tdp leaders protest with rags
తెదేపా నేతల కాగడాల ప్రదర్శన


ప్రస్తుతం రాష్ట్రంలో పులివెందుల రాజ్యాంగం నడుస్తోందని అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్​చార్జ్​ ఉమామహేశ్వర నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ అరెస్టులకు నిరసనగా తెదేపా ఆధ్వర్యంలో కళ్యాణదుర్గం ఎన్టీఆర్ భవన్ ముందు కాగడాల ప్రదర్శన చేపట్టారు. తెదేపా వర్గాల అక్రమ అరెస్టులకు నిరసనగా ఎఫ్​ఐఆర్​లను ఎన్టీఆర్ విగ్రహం ముందు దగ్ధం చేశారు.

ABOUT THE AUTHOR

...view details