ఆంధ్రప్రదేశ్

andhra pradesh

నారాయణపురంలో అగ్ని ప్రమాదం... అదుపు చేసిన యంత్రాంగం

By

Published : Mar 30, 2020, 11:34 AM IST

నారాయణపురంలో జరిగిన అగ్నిప్రమాదంలో గడ్డివాము కాలిపోయింది. పక్కనున్న మూడు బర్రెలకు గాయాలయ్యాయి. ఒక బర్రె పరిస్థితి విషమంగా ఉంది.

fire accident in ananthapuram district
నారాయణపురం గడ్డివాముకు అంటుకున్న నిప్పు

నారాయణపురం గడ్డివాముకు అంటుకున్న నిప్పు

ప్రమాదవశాత్తు చెలరేగిన మంటలకు గడ్డివాముతో పాటు మూడు బర్రెలు కాలి తీవ్రంగా దెబ్బతిన్న ఘటన అనంతపురం జిల్లా నారాయణపురం గ్రామంలో జరిగింది. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. ఎండు గడ్డి, మొక్కజొన్న కుప్పలు పూర్తిగా కాలిపోయాయి. మంటలంటుకున్న 3 బర్రెల్లో ఒకదాని పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదంలో 2 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్టు బాధితులు ఆవేదన చెందారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details