అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం వైరాంపురంలో పాముకాటుతో ఓ బాలుడు మరణించాడు. యశ్వంత్ (11) అనే బాలుడు పాము కాటుకు గురై మృతి చెందాడు. ఎర్రిస్వామి, సుజాత దంపతుల కుమారుడు యశ్వంత్ ఆడుకుంటూ ఇంటి సమీపంలో ఉన్న గడ్డివాము దగ్గరకు వెళ్లాడు. ఆ సమయంలో గమనించకుండా పాముపై కాలు వేయడంతో అది కాటు వేసింది. గ్రామంలో ప్రాథమిక చికిత్స కోసం వెళ్లగా.. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం ఉరవకొండ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆ బాలుడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఉన్న ఒక్క కొడుకు మృతి చెందడంతో బాలుడి తల్లిదండ్రులు చేసిన రోదనలు పలువురిని కలిచి వేసింది.
ఇదీ చూడండి.
అగ్నికి ఆహుతైన 200 చిరుతలు