అనంతపురం జిల్లా తలుపుల మండలంలో లాటరీ విధానంతో 20 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను రెవెన్యూ అధికారులు పంపిణీ చేశారు. మండల కేంద్రమైన తలుపులలో 16 మందికి, బండ్లపల్లిలో నలుగురు లబ్ధిదారులకు పట్టాలను అందజేసినట్లు అధికారులు తెలిపారు.
లాటరీ విధానంతో లబ్ధిదారులకు ఇళ్లపట్టాల పంపిణీ
రాష్ట్రంలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. అర్హులైన వారికి ఇళ్ల స్థలాలను కేటాయిస్తున్నారు. అనంతపురం జిల్లా తలుపుల మండలంలో 20మంది లబ్దిదారులను లాటరీ విధానంతో ఎంపిక చేసి పట్టాలను పంపిణీ చేశారు.
beneficiary select through lottery in anantapur dst