అనంతపురం జిల్లాలో...
అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించి, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వాలని ఫైర్ ఆఫీసర్ అశ్వర్థ తెలిపారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా అనంతపురంలోని కళ్యాణదుర్గం రోడ్డులో ఉన్న డీ-మార్ట్ వద్ద అగ్ని ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. మంటలు ఎగసిపడుతున్న సమయంలో వాటిని ఎలా అదుపు చేయాలి?, ప్రమాదాల బారిన పడకుండా తమను తాము ఎలా రక్షించుకోవాలి? అనే అంశాలపై పలు సూచనలు చేశారు.
పెనుకొండలో అగ్నిమాపక సిబ్బంది అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రమాదాలు జరిగిన వెంటనే అగ్నిమాపక కార్యాలయానికి సమాచారం ఇవ్వాలని సిబ్బంది సూచించారు.
విశాఖపట్నం జిల్లాలో...