ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అంటు వ్యాధులపై గ్రామీణ ప్రాంతాల్లో సదస్సులు

By

Published : Oct 21, 2020, 7:06 PM IST

ఆరోగ్యం పరిశుభ్రతపై వారం రోజులపాటు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. అనంపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో గ్రామ వాలంటీర్లు అవగాహన ర్యాలీ నిర్వహించారు.

averance program on seasonal diseases at kalyandurg anantapur
అంటు వ్యాధుల పట్ల గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన సదస్సులు

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం పరిధిలోని గ్రామీణ ప్రాంతాల్లో కరోనా వైరస్​, అంటువ్యాధులు, పారిశుద్ధ్యం నిర్వహణపై వారం రోజులపాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు మున్సిపల్​ అధికారులు తెలిపారు. ఈ మేరకు కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని గ్రామ వాలంటీర్ల... పట్టణంలోని మున్సిపాలిటీ కార్యాలయం నుంచి స్థానిక కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు.

మానవహారంగా ఏర్పడి ఆరోగ్య నియమాల పట్ల ప్రజలకు అవగాహణ కల్పించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచించారు. ఆరోగ్యం పరిశుభ్రతపై పది రోజుల పాటు నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు మున్సిపాలిటీ అధికారులు స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details