ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Ayyanna: స్వచ్ఛందంగా లొంగిపోతే మీకే మంచిది.. నా దగ్గర ఆధారాలు ఉన్నాయి: అయ్యన్న

By

Published : Apr 24, 2023, 3:20 PM IST

TDP leader Ayyanna: అనకాపల్లి జిల్లాలో జరిగిన రంగురాళ్ల దోపిడీ ఘటనపై లోకాయుక్తతో పాటు గ్రీన్‌ ట్రిబ్యునల్‌కు ఫిర్యాదు చేయునున్నట్లు.. టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు ప్రకటించారు. దీని వెనుకు ఉన్న అక్రమార్కులందరినీ బయటకు లాగుతానని స్పష్టం చేశారు. దోపిడీకి సంబంధించి కొన్ని ఆధారాలు పట్టుకున్నామని అయ్యన్న తెలిపారు. జేసీబీ, ట్రాక్టర్ల యజమాలు స్వచ్ఛందంగా లొంగిపోతే మీకే మంచిదని హితవు పలికారు.

TDP leader Ayyanna
TDP leader Ayyanna

TDP leader Ayyanna: అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం సాలిక మల్లవరం వద్ద రిజర్వ్ ఫారెస్ట్​లో రంగురాళ్లు తవ్వకం ఘటనపై లోకాయుక్తకు ఫిర్యాదు చేయడంతో పాటు కేంద్రం పరిధిలోని గ్రీన్ ట్రిబ్యునల్​కి ఫిర్యాదు చేస్తున్నట్టు మాజీమంత్రి తెలుగుదేశం పార్టీ సభ్యులు చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రకటించారు. నర్సీపట్నంలో విలేకరులతో మాట్లాడుతూ ఆయన ఇప్పటికే దీనికి సంబంధించి కొన్ని ఆధారాలు పట్టుకున్నామని అయ్యన్న పేర్కొన్నారు. జేసీబీ, ట్రాక్టర్లు యజమాలు స్వచ్ఛందంగా లొంగిపోవాలని లేకుంటే రాజకీయాలకు అతీతంగా ఎటువంటి వారైనా ఉపేక్షించేది లేదని వారిపై చట్టపరమైన చర్యలకు ఆయన డిమాండ్ చేశారు.. రంగురాళ్ల తవ్వకం వెనక ఎవరున్నా వదిలిపెట్టది లేదని ఆయన పాత్రుడు పునరుద్ధాటించారు.

అవసరమైతే దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్తా..!అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం సాలికమర్లవరం వద్ద రిజర్వ్ ఫారెస్ట్​లో అక్రమంగా రంగురాళ్ల తవ్వకాలు జరుగుతున్నాయని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. దానిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని.. ఈ ఘటనలో ఎవరెవరికి సంబంధం ఉందో అందరిపైనా విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు అనకాపల్లిలో ఆయన వీడియో విడుదల చేశారు. ఈ రంగురాళ్ల తవ్వకం ఘటనలో అటవీ, పోలీస్ శాఖ అధికారుల ప్రమేయం ఉందనే అనుమానాలు ఉన్నాయని.. ఈ నేపథ్యంలో సర్కిల్ ఇన్​స్పెక్టర్​, ఎస్సై, అటవీ శాఖ అధికారుల ఫోన్లను తక్షణమే స్వాధీనం చేసుకొని విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అవసరమైతే దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్తామని అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు. రంగురాళ్ల తవ్వకందారుల వెనుక స్థానిక ఎమ్మెల్యే హస్తము ఉందని అయ్యన్నపాత్రుడు ఆరోపించారు దీంతోపాటు లెటరైట్ తవ్వకాలు అక్రమ గంజాయి రవాణా తదితర కేసులపై తక్షణమే విచారణ జరిపించాలని అయ్యన్న డిమాండ్ చేశారు.

రంగురాళ్ల తవ్వకం గురించి నా దృష్టికి రావడం తోనే నేను ఎంక్వయిరీ పెట్టాను. ఇప్పటికే మాకు ఒక జేసీబీ దొరికింది.. ఆ రోజు రాత్రి ట్రాక్టర్​లకు పెట్రోలు ఏక్కడ కొట్టించారో అన్ని ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. మీరు వచ్చి లొంగిపోతే మంచిది.. దీనిని వదిలే ప్రసక్తే లేదు గ్రీన్‌ ట్రిబ్యునల్‌కు కూడా ఫిర్యాదు చేస్తా.- అయ్యన్నపాత్రుడు, టీడీపీ నేత

స్పందించిన ఎమ్మెల్యే గణేష్..అయ్యన్నపాత్రుడు చేసిన రంగురాళ్ల తవ్వకాల వ్యాఖ్యలపై ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్​ గణేష్ స్పందించారు. దీనికి సంబంధించి తనపై కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారని.. విలేకరులకు వీడియో విడుదల చేశారు. అలాగే రంగురాళ్ల తవ్వకాలు జరిపి ఒక్క రూపాయి అయినా సంపాదించినట్టు నిరూపిస్తే తక్షణమే రాజకీయాల నుంచి తప్పకుంటానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. అంతేకాకుండా ఈ విషయంలో డబ్బులు సంపాదించినట్టు నిరూపించకపోతే అయ్యన్నపాత్రుడు రాజకీయాల నుంచి తప్పకుంటారా.. అని ఆయన సవాల్ విసిరారు. ‌తమ ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేసి బురద జల్లడమే లక్ష్యంగా అయ్యన్నపాత్రుడు చూస్తున్నారని ఎమ్మెల్యే గణేష్ పేర్కొన్నారు.

స్వచ్ఛందంగా లొంగిపోతే మీకే మంచిది.. నా దగ్గర ఆధారాలు ఉన్నాయి

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details