ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Mirchi Farmers: నిండా ముంచిన అకాల వర్షాలు.. ఆదుకోవాలని మిర్చి రైతుల వేడుకోలు

By

Published : May 11, 2023, 1:11 PM IST

Chilli crop loss: పంట చేతికందుతుంది.. చేసిన అప్పులు తీర్చేయొచ్చని అనుకున్నారు. కానీ వారి ఆశలను అకాల వర్షాలు చంపేశాయి. ఎకరాకు లక్ష రూపాయల వరకు పెట్టుబడి పెట్టినా.. తిరిగి కనీసం ఒక్క రూపాయి కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేసిన అప్పులు ఎలా తీర్చాలోనని మిర్చి రైతులు ఆందోళన చెందుతున్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకుంటున్నారు.

Mirchi Farmers suffered due to untimely rains
మిర్చి రైతులను నిండా ముంచిన అకాల వర్షాలు

మిర్చి రైతులను నిండా ముంచిన అకాల వర్షాలు

Chilli crop loss: ఎన్నో ఆశలతో వేసవిలో మిర్చి పంటను సాగు చేసిన రైతులకు అకాల వర్షాలు నట్టేట ముంచాయి. బ్యాంకుల నుంచి ప్రైవేటు వడ్డీ వ్యాపారం నుంచి అప్పులు చేసి చేలో మిర్చి పంటకి పెట్టుబడి పెట్టిన రైతులు.. పంట మొత్తం నాశనం కావడంతో లబోదిబోమంటున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో అరకులోయ మండలం చినలబడు పంచాయతీ పరిధిలోని పక్కన కుడి మాలసింగారం, తుడుం, మాలివలస గ్రామాల పరిధిలో సుమారు 100 ఎకరాల్లో ఈ ఏడాది సంప్రదాయ మిర్చితో పాటు బజ్జీ మిర్చిని రైతులు సాగు చేశారు.

మరో పది రోజుల్లో పంట అంతా చేతికందుతుందన్న సమయంలో అకాల వర్షాలు పంటను ముంచేశాయి. మిర్చి తోటల్లో వర్షపు నీరు ఎక్కువగా నిల్వ ఉండిపోవడంతో మొక్కలు కుళ్లిపోయి ఎండిపోయాయి. మొక్కలకు మొలిచిన మిర్చి సైతం వాడిపోయింది. వర్షాలకు కురుస్తున్న నీటి ప్రవాహంతో పంట అంతా పాడైపోయింది. సుమారు 100 ఎకరాల్లో సాగుచేసిన మిర్చికి దాదాపు కోటి రూపాయల వరకు నష్టం ఏర్పడిందని రైతులు గగ్గోలు పెడుతున్నారు.

అసలే ఆర్థిక స్తోమత అంతంత మాత్రంగానే ఉన్న గిరి రైతులు.. పెట్టుబడి పెట్టిన డబ్బు సైతం వెనక్కి రాని పరిస్థితి నెలకొనడంతో లబోదిబోమంటున్నారు. అప్పులు చేసి పెట్టుబడి పెట్టిన సొమ్మును తిరిగి ఎలా కట్టాలో తెలియక బిక్కుబిక్కుమంటున్నారు. కరోనా లాక్ డౌన్ సమయంలోనూ ఆయా గ్రామాలకు చెందిన రైతులు బజ్జీ మిర్చిని సాగు చేశారు.

ఆ సమయంలో మిర్చిని కొనేందుకు వ్యాపారులు ఎవరూ రాకపోవడంతో పంట అంతా పొలాల్లోనే వదిలేశారు. ఆ ఇబ్బందుల నుంచి ఎలాగోలా తేరుకుని.. సాగు చేపట్టిన రైతులను.. అకాల వర్షాలు అవస్థల్లోకి నెట్టాయి. ఎకరాకు లక్ష రూపాయల వరకు పెట్టుబడి పెట్టినా.. తిరిగి కనీసం ఒక్క రూపాయి కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఈ విషయంపై ఐటీడీఏతో పాటు ప్రభుత్వం స్పందించి పరిహారం అందించి.. తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

నేను ప్రతి ఏటా మిర్చి పంటను రెండు మూడు ఎకరాల్లో సాగు చేస్తాను. ప్రతి ఏటా పంట బాగానే పండేది. అయితే ఈ ఏడాది అకాల వర్షాల కారణంగా నా పంట నీట మునిగిపోయింది. ఈ మిర్చి పంట సాగుకు నేను లక్షల్లో పెట్టుబడి పెట్టాను. ఇప్పుడు ఈ పంటపై పైసా కూడా వచ్చేలా లేదు. దీనిపై స్పందించి.. ప్రభుత్వమే మమల్ని ఆదుకోవాలి. - భగవాన్, రైతు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details