ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త గొంతు కోసింది.. ఏం జరిగింది..!

By

Published : Oct 13, 2022, 3:04 PM IST

Updated : Oct 13, 2022, 4:00 PM IST

Wife cut her husband's throat: ఆమెకు వివాహమై.. ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్త, పిల్లల్ని వదిలి వేరే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వారిద్దరికీ ఒక కుమారుడు పుట్టాడు. అయితే గత కొంత కాలంగా ఆమెను అతను పట్టించుకోకపోవడంతో .. తరచూ గొడవలు జరిగేవి. తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని అతనిపై కోపం పెంచుకుంది. ఈ నేపథ్యంలోనే బైక్​పై వెళ్తుండగా గొంతు కోసింది.

wife tried to kill her husband
wife tried to kill her husband


Wife tried to kill her husband: నెల్లూరు రూరల్ మండలం సౌత్​మోపూరు వద్ద దారుణ ఘటన చోటు చేసుకుంది. బైక్​పై వెళ్తుండగా భర్త గొంతును భార్య కోసింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాధితుడిని స్థానికులు హాస్పిటల్​కు తరలించారు. సౌత్ మోపూర్​కు చెందిన ప్రసన్న కుమార్, లక్ష్మీ ప్రసన్నను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇదివరకే వివాహమై.. ఇద్దరు పిల్లలున్న లక్ష్మీప్రసన్న వారిని వదిలేసి ప్రసన్నకుమార్​ను వివాహం చేసుకుంది.

వీరికి ఓ కుమారుడు పుట్టగా.. ఇటీవల తనను నిర్లక్ష్యం చేస్తున్నాడంటూ భర్తపై కక్ష పెంచుకుంది. నెల్లూరు నుంచి బైక్​పై సౌత్ మోపూరుకు వెళ్తుండగా మొగళ్లపాళెం స్టేడియం సమీపంలో చాకుతో భర్త గొంతు కోసింది. గుర్తించిన స్థానికులు బాధితుడిని చికిత్స నిమిత్తం నెల్లూరు ప్రభుత్వ హాస్పిటల్​కు తరలించారు. కేసు నమోదు చేసిన రూరల్ పోలీసులు లక్ష్మీ ప్రసన్నను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త గొంతు కోసింది

ఇవీ చదవండి:

Last Updated : Oct 13, 2022, 4:00 PM IST

ABOUT THE AUTHOR

...view details