ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Ganjayi Seize in Hyderabad : అంతర్రాష్ట్ర గంజాయి ముఠా అరెస్టు.. 800 కిలోలు సీజ్

By

Published : Jan 21, 2022, 12:30 PM IST

అంతర్రాష్ట్ర గంజాయి ముఠాను తెలంగాణ పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.1.80 కోట్లు విలువ చేసే గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

Ganjayi
Ganjayi

అంతర్రాష్ట్ర గంజాయి ముఠాను తెలంగాణలోని హైదరాబాద్​ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 800 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ.1.80 కోట్లు ఉంటుందని అంచనా వేశారు.

శంషాబాద్ ఎస్​వోటీ, మియాపూర్ పోలీసులు సంయుక్త ఆపరేషన్​ నిర్వహించారు. గంజాయి తరలిస్తున్న వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర ఇవాళ వెల్లడించనున్నారు.

ఇదీ చదవండి :Ganja Report In Andhra Pradesh: రాష్ట్రంలో రోజుకు ఎంత గంజాయి పట్టుబడుతుందంటే..

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ABOUT THE AUTHOR

...view details