ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కోకాపేటలో విషాదం.. బాలుడిని మింగేసిన స్విమ్మింగ్ పూల్‌

By

Published : Jul 31, 2022, 7:54 PM IST

1

Boy Died in Swimming Pool: కుమారుడంటే ఆ తల్లిదండ్రులకు ప్రాణం.. తన మీదే ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.. ఎల్లప్పుడూ కంటికి రెప్పలా కాపాడుకున్నారు. కానీ ఆ కుటుంబాన్ని విధి వెక్కిరించింది. సరదాగా ఆడుకుందామని అపార్ట్​మెంట్​లో ఉన్న సిమ్మింగ్​పూల్​కి వెళ్లిన కుమారుడు విగతజీవిగా మారడంతో ఆ తల్లిదండ్రులు పుట్టెడు దుఃఖంలో మునిగిపోయారు. ఈ విషాదకర ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది.

Boy Died in Swimming Pool: సరదాగా అలా ఆడుకుందామని వెళ్లిన తొమ్మిదేళ్ల బాలున్ని స్విమ్మింగ్​పూల్ రూపంలో మృత్యువు మింగేసింది. గృహప్రవేశం కోసం బంధువుల ఇంటికి వచ్చిన వారికి విషాదం మిగిల్చింది. ఈ విషాదకర ఘటన తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

విజయవాడకు చెందిన విజయ్ కుమార్, పద్మా రాణి దంపతులు శనివారం మధ్యాహ్నం కోకాపేటలోని బంధువుల ఇంటికి గృహ ప్రవేశానికి వచ్చారు. వారికి తొమ్మిదో తరగతి చదువుతున్న శ్యామ్​ అనే కుమారుడు ఉన్నాడు. ఆదివారం ఆ బాలుడు అలా ఆడుకుందామని అపార్ట్​మెంట్​లోని స్విమ్మింగ్​పూల్ వద్దకు వెళ్లాడు. అక్కడ కొంతమంది పిల్లలు ఆడుకుంటుంటే వారితో పాటు చేరాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు ఒక్కసారిగా శ్యామ్ నీటిలో మునిగిపోయాడు. ఎవరూ గమనించకపోవడంతో ఆ బాలుడు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. చాలా సేపటికి బాలుడు ఇంకా రాకపోవడంతో తల్లిదండ్రులు, బంధువులు ఆ ప్రాంతమంతా వెతికారు. చివరికి స్విమ్మింగ్ పూల్​​ దగ్గరకి వెళ్లగానే అక్కడ కుమారుడు అచేతన స్థితిలో ఉన్నాడు. వెంటనే తల్లిదండ్రులు, బంధువులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో బాలుడి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details