Road accident: ఆర్టీసీ బస్సు - ఆటో ఢీ.. ఇద్దరు మృతి

author img

By

Published : Jul 31, 2022, 2:01 PM IST

road accident

Road accident: రాష్ట్రంలో రోజురోజుకు రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. కడప శివారులోని ఆర్టీసీ బస్సు - ఆటో ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి.

Road accident: కడప శివారులోని మద్దిమడుగు తాండ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. కడప నుంచి రాయచోటికి వెళ్తున్న ఆర్టీసీ బస్సు రామాపురం నుంచి కడప వైపు వెళ్తున్న ఆటోను మద్దిమడుగు తాండ వద్ద ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన మరో ముగ్గురిని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తరలించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు... కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.