ఆంధ్రప్రదేశ్

andhra pradesh

"జగన్ మూడేళ్ల పాలన.. 9 మోసాలు, 18 కుంభకోణాలు, 36 దోపిడీలు"

By

Published : May 1, 2022, 4:48 PM IST

జగన్ మూడేళ్ల పాలన 9 మోసాలు, 18 కుంభకోణాలు, 36 దోపిడీలుగా సాగుతోందని తెదేపా సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. నవరత్నాలు ఇస్తానని చెప్పి, నవమోసాలకు పాల్పడిన జగన్ రెడ్డికి ఎప్పుడెప్పుడు బుద్ధి చెప్పాలా.. అని ప్రజలంతా ఎదురు చూస్తున్నారని అన్నారు.

జగన్​కు బుద్ధి చెప్పేందుకు ప్రజల ఎదురుచూపు
జగన్​కు బుద్ధి చెప్పేందుకు ప్రజల ఎదురుచూపు

జగన్‌ నవరత్నాలని డబ్బా కొడుతున్నాడని.. కానీ అవి నవమోసాలని తెదేపా సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. నవరత్నాలు ఇస్తానని చెప్పి, నవమోసాలకు పాల్పడిన జగన్ రెడ్డికి ఎప్పుడెప్పుడు బుద్ధి చెప్పాలా.. అని ప్రజలంతా ఎదురు చూస్తున్నారని అన్నారు. జగన్ మూడేళ్ల పాలన 9 మోసాలు, 18 కుంభకోణాలు, 36 దోపిడీలుగా సాగుతోందన్నారు. నవరత్నాల గురించి మాట్లాడటం, గెలవకపోతే వాటిని నిలిపేస్తారని చెప్పడాన్ని ప్రజలే ఈసడించుకుంటున్నారని యనమల తెలిపారు.

విచ్చలవిడి అప్పులతో ప్రజలకు తిప్పలు, కరెంటు ఛార్జీల భగభగలతో ధరల సెగలు అని యనమల విమర్శించారు. పేదల జీవితాలతో చెలగాటం ఆడి, కొనుగోలు శక్తిని, పొదుపు శక్తిని దెబ్బతీయటంతో పాటు పేదరికం పెంచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరికి సంక్షేమ పథకాలను కూడా అవినీతి మయం చేశారని వాపోయారు.

ఇదీ చదవండి: Vijayawada Drugs : కొరియర్​లో పార్శిల్ పంపారు.. తిరిగి వెనక్కొచ్చింది.. ఓపెన్ చేసి చూస్తే..

ABOUT THE AUTHOR

...view details