ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అద్దె కట్టలేను.. ఆదార్​కార్డు లేదు.. ఆడబిడ్డలతో చెట్టుకిందే..!

By

Published : May 9, 2022, 7:59 AM IST

footpath

No Shelter problems: వారికి అమ్మానాన్న లేరు... అన్నీ తానై అమ్మమ్మ పెంచుతోంది... కాగితాలు ఏరుకుంటూ, చెప్పులు కుట్టుకుంటూ ముగ్గురు మనమరాళ్లను కంటికి రెప్పలా కాపాడుకుంటోంది. ఇంటి అద్దె కట్టలేక చెట్టుకిందే జీవనం సాగిస్తోంది. ఎండావాన, అకతాయిల అల్లరి నుంచి బిడ్డలను కాపాడుకోవడం కష్టంగా ఉందని.. ఇల్లు కోసం ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లింది. రేషన్ కార్డు లేదని, వివరాలు నమోదు చేయలేదని కారణాలు చెప్పి వెనక్కి పంపుతున్నారు. మరి పేదల కోసం ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు..? ఇదేనా ప్రజా ప్రభుత్వం అంటే..?

A family living on footpath: పీతల పార్వతి ఫుట్‌పాత్‌పై చెప్పులు కుట్టుకుంటూ జీవనం సాగిస్తోంది. పక్కనే ఉన్న ఆ ముగ్గురు.. ఆమె కుమార్తె పిల్లలు. పార్వతి కుమార్తె ఆరేళ్ల క్రితం మూడో బిడ్డ పుట్టాక అనారోగ్యంతో చనిపోయింది. ఆ తర్వాత కొద్ది నెలలకే అల్లుడూ మృతి చెందాడు. అప్పటినుంచి మనవరాళ్ల బాధ్యత ఆమెపై పడింది. కాగితాలు ఏరుకుంటూ, చెప్పులు కుట్టుకుంటూ జీవనం సాగిస్తున్న పార్వతి.. 20 ఏళ్లుగా విజయవాడ సత్యనారాయణపురంలోని ఏలూరు కాల్వ వంతెన ఫుట్‌పాత్‌పైనే ఉంటోంది. నగరంలో ఇంటికి అద్దెలు కట్టలేక.. చెట్టు కిందే జీవనం సాగిస్తోంది. ముగ్గురు ఆడ పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ.. దాతలు ఇచ్చిన భోజనం, దుస్తులను పిల్లలకు ఇచ్చి బతుకు బండి లాగిస్తోంది.

"ఎండొచ్చినా వానొచ్చినా ఆడపిల్లలతో రోడ్డు పక్కన పడుకోవాలంటే భయం వేస్తుంది. ఆకతాయిలతో ఇబ్బందిగా ఉంది. ఇల్లు ఉంటే ఆడబిడ్డలకు కొంచెం రక్షణగా ఉంటుందని, సొంత ఇంటి కోసం కార్యాలయాల చుట్టూ తిరిగా. రేషన్‌ కార్డు లేదని ఇవ్వడం లేదు. ప్రజాసాధికార సర్వేలో వివరాలు నమోదు కాలేదని, ఇంకేవో కారణాలతో రేషన్‌ కార్డు ఇవ్వలేదు. రేషన్‌ కార్డు లేదని ఇల్లు, పింఛను వంటి లబ్ధి చేకూరడం లేదు. మనవరాళ్లని పాఠశాలలో చేర్పించాలనుకున్నా ఆధార్‌ కార్డులు లేవని చేర్చుకోవడం లేదు" -పార్వతి

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details