విచారణ పేరుతో ఎస్సీలను బలి తీసుకుంటున్నవి పోలీస్ స్టేషన్లా లేక వైకాపా నాయకుల ఫ్యాక్షన్ డెన్లా అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. విచారణ అని పిలిచి విజయవాడ కృష్ణలంకకు చెందిన ఎస్సీ యువకుడు అజయ్ను కొట్టి చంపేశారని ఆరోపించారు. దళితులపై జగన్ రెడ్డి దమనకాండ పరాకాష్ఠకు చేరిందని మండిపడ్డారు. అనారోగ్యంతో అజయ్ చనిపోయాడని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. అతని కుటుంబసభ్యులు నోరు మెదపకుండా.. వారిని బెదిరించారని ఆరోపించారు. దుర్గగుడి సభ్యురాలి కుమారుడికో న్యాయం, ఎస్సీ యువకుడికి మరో న్యాయమా అని లోకేశ్ నిలదీశారు.
మాస్క్ పెట్టుకోలేదని కిరణ్ను కొట్టి చంపారు. ఇసుక అక్రమ రవాణాకు అడ్డువచ్చాడని వరప్రసాద్కు శిరోముండనం చేశారు. తాజాగా విచారణ పేరుతో అజయ్ను చంపేశారని లోకేశ్ ఆరోపించారు. బాధిత బంధువుల వీడియోను తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
తెదేపా నిజనిర్ధరణ కమిటీ