ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'ఎస్సీ, ఎస్టీ సబ్​ప్లాన్ నిధులను వెంటనే విడుదల చేయాలి'

By

Published : Mar 30, 2021, 2:13 PM IST

రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలను మోసం చేస్తోందని భాజపా ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు దేవానంద్ విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ నిధులను సంక్షేమ పథకాలకు వినియోగిస్తున్నారని ఆరోపించారు.

bjp sc morcha fires on ysrcp government
విజయవాడ ధర్నా చౌక్​లో భాజపా ఎస్సీ మోర్చా ధర్నా

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలకు ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను మళ్లించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ భాజపా ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్​లో నిరసన కార్యక్రమం చేపట్టింది. సబ్​ప్లాన్ నిధులను వెంటనే విడుదల చేయాలని భాజపా ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గుడిసె దేవనంద్ డిమాండ్ చేశారు. వైకాపా ప్రభుత్వం దళిత వ్యతిరేక విధానాలను అమలు చేస్తోందని ఎస్సీ మోర్చా నాయకులు విమర్శించారు.

ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్లను నిర్వీర్యం చేస్తూ గత రెండేళ్లుగా కార్పొరేషన్ నిధులను దారి మళ్లిస్తున్నారని ఆరోపించారు. దళితులను లక్షాధికారులను చేస్తానని దివంగత వైఎస్సార్ చెప్తే... జగన్ దానికి విరుద్ధంగా భిక్షగాళ్లను చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం దిష్టి బొమ్మను దగ్ధం చేశారు.

ఇదీ చదవండి:బిల్లు ఒక్కటే.. ఇసుక ట్రిప్పులు అనేకం

ABOUT THE AUTHOR

...view details