ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రైతుల పాదయాత్రలో ఉద్రిక్తత.. పరస్పర నినాదాలతో హోరెత్తుతున్న మల్లయ్యపేట జంక్షన్‌

By

Published : Oct 17, 2022, 7:19 PM IST

TENSION AT PADAYATRA : రాజమహేంద్రవరంలో కొనసాగుతున్న అమరావతి రైతుల పాదయాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మల్లయ్యపేట జంక్షన్​లో వైకాపా శ్రేణులు నల్లబెలూన్లతో నిరసన తెలిపారు.

TENSION AT PADAYATRA
TENSION AT PADAYATRA

TENSION AT AMARAVATI PADAYATRA : నిర్విరామంగా కొనసాగుతున్న అమరావతి రైతుల పాదయాత్రలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. రాజమహేంద్రవరం మల్లయ్యపేట జంక్షన్‌లో వైకాపా శ్రేణులు నిరసన తెలిపారు. నల్లబెలూన్లు ప్రదర్శించడంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. వైకాపా శ్రేణులు కవ్విస్తున్నా.. వారి కర్తవ్యాన్ని మాత్రం వదలకుండా జై అమరావతి నినాదాలతో రైతులు ముందుకు సాగారు.

రైతుల పాదయాత్రలో ఉద్రిక్తత.. పరస్పర నినాదాలతో హోరెత్తుతున్న మల్లయ్యపేట జంక్షన్‌

ABOUT THE AUTHOR

...view details