ETV Bharat / city

ప్రభుత్వ విధానాలపైనే మా పోరాటం.. పోలీసులపై కాదు: పవన్‌

author img

By

Published : Oct 17, 2022, 3:53 PM IST

Updated : Oct 17, 2022, 4:49 PM IST

PAWAN STARTED FROM VISAKHA TO VIJAYAWADA : విశాఖలో జనసేన కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేశారని అధినేత పవన్‌ కల్యాణ్​ అన్నారు. విశాఖపట్నం పర్యటన ముగించుకుని విజయవాడ చేరుకున్నారు. ప్రజలకు కనీసం అభివాదం చేయకుండా ఆంక్షలు విధించారని పేర్కొన్నారు. మా పోరాటం ప్రభుత్వం పైనే కానీ.. పోలీసులపై కాదని స్పష్టం చేశారు.

PAWAN STARTED FROM VISAKHA TO VIJAYAWADA
PAWAN STARTED FROM VISAKHA TO VIJAYAWADA

PAWAN GOING TO VIJAYAWADA : జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ విశాఖపట్నం నుంచి విజయవాడ చేరుకున్నారు. ఆదివారం మధ్యాహ్నం పోలీసు అధికారులు పవన్‌కు నోటీసులిచ్చారు. పోలీసుల ఆంక్షలతో రెండు రోజులు హోటల్లోనే ఉండిపోయిన ఆయన.. హెలికాప్టర్​లో విజయవాడకు చేరుకున్నారు. నేరుగా మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి వెళ్లారు. విశాఖలో బయల్దేరే ముందు అరెస్ట్​ అయ్యి విడుదలైన పలువురితో పవన్​ చర్చించారు.

విశాఖలో జనసేన కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేశారని పవన్‌ కల్యాణ్​ అన్నారు. జనసేన కార్యకర్తలపై హత్యాయత్నం కేసులు పెట్టారని.. అక్రమ కేసులపై న్యాయ పోరాటానికి నిపుణులతో చర్చించినట్లు తెలిపారు. ప్రజలకు కనీసం అభివాదం చేయకుండా ఆంక్షలు విధించారని పేర్కొన్నారు. మా పోరాటం ప్రభుత్వం పైనే కానీ పోలీసులపై కాదని స్పష్టం చేశారు. భవిష్యత్‌లో ఇలాంటి ఆంక్షలు విధించకుండా న్యాయపోరాటం చేస్తామని వెల్లడించారు.

  • విశాఖపట్నంలో జనసేన నేతలు, కార్యకర్తలను అక్రమ అరెస్టులు చేసి హత్యాయత్నం కేసులు పెట్టారు. దీనిపై న్యాయ పోరాటం చేసేందుకు మంగళగిరి పయనమైన జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. pic.twitter.com/aoUxwpphO5

    — JanaSena Party (@JanaSenaParty) October 17, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

రాజభవన్​కు పవన్​ : పవన్‌ రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను కలవనున్నట్లు సమాచారం. విశాఖలో జరిగిన పరిణామాలు, పోలీసులు వ్యవహరించిన తీరుపై గవర్నర్‌కు ఆయన ఫిర్యాదు చేసే వీలుంది. ఇప్పటికే జనసేన నేతలు గవర్నర్‌ అపాయింట్‌మెంట్ కోరినట్లు తెలుస్తోంది. పవన్​కల్యాణ్​ విజయవాడ రాక నేపథ్యంలో విమానాశ్రయం దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసులు భారీగా మోహరించారు. విమానాశ్రయంలోకి ప్రయాణికులను మాత్రమే అనుమతిచ్చారు.

నోవాటెల్​ వద్ద భారీ బందోబస్తు : అంతకుముందు విశాఖలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ బస చేసిన నోవాటెల్‌ హోటల్‌ వద్ద పోలీసుల ఆంక్షలు కొనసాగాయి. పవన్‌కు సంఘీభావం తెలిపేందుకు పెద్ద ఎత్తున నేతలు, కార్యకర్తలు తరలివస్తారన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. హోటల్లోకి ఎవరూ వెళ్లకుండా అన్ని ద్వారాల వద్ద మోహరించారు.

పవన్‌ను కలవాలంటే ఏసీపీ అనుమతి తీసుకోవాల్సిందే.. హోటల్‌ వద్ద ఆంక్షలను పోలీసులు మరింత కఠినతరం చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. పవన్‌ బస చేసిన అంతస్తు, హోటల్‌ కాంపౌండ్‌లో పార్టీ నేతలెవరూ లేకుండా తరిమేస్తున్నారు. పవన్‌ను ఎవరు కలవాలన్నా ఏసీపీ అనుమతి తీసుకోవాల్సిందేనంటూ కొత్త ఆంక్షలను అమల్లోకి తీసుకొచ్చారు. పవన్‌ తన గదిలో పార్టీ నేతలతో సైతం ఎలాంటి సమావేశాలు నిర్వహించకుండా ఉండేందుకు పోలీసులు ఈ తరహా చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది..

ఇవీ చదవండి:

Last Updated :Oct 17, 2022, 4:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.