ఆంధ్రప్రదేశ్

andhra pradesh

120 పట్టణాల్లో నగర వనాలు: మంత్రి పెద్దిరెడ్డి

By

Published : Jun 2, 2022, 6:39 PM IST

Minister Peddireddy: రాష్ట్రంలోని 120 పట్టణాల్లో కనీసం ఒక్క నగరవనాన్ని అయినా ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు అటవీశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఈ ఏడాది పలమనేరు, కర్నూలు, పుట్టపర్తి, ప్రొద్దుటూరు, చిత్తూరు, మదనపల్లిలో కొత్తగా నగరవనాల్ని ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. సచివాలయంలో అటవీశాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో తెలిపారు.

Minister Peddireddy
Minister Peddireddy

రాష్ట్రవ్యాప్తంగా 120 పట్టణాల్లో కనీసం ఒక్క నగర వనాన్ని అయినా ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు అటవీశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. ఈ ఏడాది కొత్తగా పలమనేరు, కర్నూలు, పుట్టపర్తి, ప్రొద్దుటూరు, చిత్తూరు, మదనపల్లిలో కొత్తగా నగరవనాల్ని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. సచివాలయంలో అటవీశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి.. 18 కోట్ల రూపాయల వ్యయంతో 220 ఎకరాల్లో ఈ నగరవనాలను అభివృద్ధి చేయనున్నట్లు స్పష్టం చేశారు.

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 23 నగరవనాలు, 7 టెంపుల్ ఎకో పార్కులు ఉన్నాయని మంత్రి వెల్లడించారు. పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు ఆహ్లాదాన్ని అందించేలా.. నగరవనాల అభివృద్ధిపై దృష్టి పెట్టినట్టు మంత్రి తెలిపారు. నగరవనం, టెంపుల్ ఎకో పార్కుల అభివృద్ధి కోసం 2022-23 లో రూ.14.94 కోట్లు కేటాయించినట్లు మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు.

ఇదీ చదవండి:Yanamala: లంచాలపై జగన్​ వ్యాఖ్యలు.. అతిపెద్ద జోక్: యనమల

ABOUT THE AUTHOR

...view details