రైతులకు పంట రుణాలిచ్చేందుకు సిబిల్ స్కోరింగ్ పరిశీలన నిబంధనను సడలించాలని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభలో కోరారు. సిబిల్ స్కోర్ పరిశీలన నిబంధన వల్ల పలువురు రైతులు.... బ్యాంకుల నుంచి అప్పులు దొరక్క ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. అన్నదాతల మీద నమ్మకం ఉంచి బ్యాంకులు రుణాలిచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆర్థికశాఖ మంత్రిని విజ్ఞప్తి చేశారు.
'రైతుల మీద నమ్మకం ఉంచి బ్యాంకులు రుణాలివ్వాలి'
పంట రుణాలకు సిబిల్ స్కోర్ పరిశీలన నిబంధనను తొలగించాలని వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి రాజ్యసభలో కోరారు. రైతుల మీద నమ్మకం ఉంచి బ్యాంకులు రుణాలివ్వాలన్నారు. ఈ మేరకు ఆర్థికమంత్రి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ysrcp-mp-vijaya-sai-reddy-on-parlament