ఆంధ్రప్రదేశ్

andhra pradesh

హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్​లో అనారోగ్యంతో పులి మృతి

By

Published : Jun 25, 2020, 10:08 PM IST

హైదరాబాద్ పాతబస్తీలోని నెహ్రూ జూలాజికల్ పార్క్​లో అనారోగ్యంతో 8 ఏళ్ల తెల్ల పులి 'కిరణ్​' మృతి చెందింది. గత నెల రోజులుగా నియోప్లాస్టిక్​ ట్యూమర్ వ్యాధికి చికిత్స పొందుతూ గురువారం ఉదయం మరణించిందని జూపార్క్​ అధికారులు తెలిపారు. కిరణ్​కు పోస్ట్​మార్టం నిర్వహించి... ట్యూమర్​ నమూనాను సీసీఎంబీకి పంపినట్లు జూపార్క్ అధికారులు ప్రకటించారు.

white tiger kiran died at hyderabad
నెహ్రూ జూలాజికల్ పార్క్​లో అనారోగ్యంతో పులి మృతి

తెలంగాణలోని హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్​లో అనారోగ్యంతో 8 ఏళ్ల తెల్ల పులి మృతి చెందింది. ఈ మగ పులి పేరు 'కిరణ్​' అని... గత నెల రోజులుగా నియోప్లాస్టిక్​ ట్యూమర్​తో బాధ పడుతుందని అధికారులు వివరించారు. నెల రోజులుగా చికిత్స పొందుతూ గురువారం ఉదయం మరణించిందని జూపార్క్​ అధికారులు తెలిపారు.

కిరణ్ ఇక్కడే జూపార్క్​లో జన్మించిందని... దాని తండ్రి బద్రి, తాత రుద్ర అనే పులులు కూడా ఇదే వ్యాధితో మరణించాయని జూపార్క్​ నిర్వాహకులు తెలిపారు. కిరణ్​కు పోస్ట్​మార్టం నిర్వహించిన వైద్యబృందం... ట్యూమర్​ నమూనాను సీసీఎంబీకి పంపినట్లు జూపార్క్ అధికారులు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details