School Bus Stuck in Flood: తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్నగర్ జిల్లాలో 25 మంది చిన్నారులతో ఉన్న ఓ ప్రైవేటు పాఠశాల బస్సుకు పెనుప్రమాదం తప్పింది. మాచన్పల్లి-కోడూరు మధ్య ఓ ప్రైవేటు పాఠశాల బస్సు రైల్వే అండర్ బ్రిడ్జిలో చేరిన వరదనీటిలో చిక్కుకుంది. రామచంద్రాపురం, సూగురుగడ్డ తండా నుంచి విద్యార్థులను ఎక్కించుకుని పాఠశాలకు వెళ్తున్న బస్సు.. మార్గమధ్యలో వరద నీటిలోకి రాగానే ఆగిపోయింది.
వరదలో చిక్కుకున్న పాఠశాల బస్సు.. 25 మంది విద్యార్థులు సేఫ్
School Bus Stuck in Flood: మహబూబ్నగర్ జిల్లాలో 25 మంది చిన్నారులతో ఉన్న ఓ ప్రైవేటు పాఠశాల బస్సుకు పెనుప్రమాదం తప్పింది. మాచన్పల్లి-కోడూరు మధ్య ఓ ప్రైవేటు పాఠశాల బస్సు రైల్వే అండర్ బ్రిడ్జిలో చేరిన వరదనీటిలో చిక్కుకుంది.
వరదలో చిక్కుకుపోయిన పాఠశాల బస్సు.. 25 మంది విద్యార్థులు సేఫ్..
చూస్తుండగానే బస్సులోకి నీరు చేరడంతో అప్రమత్తమైన డ్రైవర్.. స్థానికులను సాయం కోరాడు. వెంటనే స్పందించిన స్థానికులు విద్యార్థులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అనంతరం ట్రాక్టర్ సహాయంతో నీటిలో చిక్కుకున్న బస్సును బయటకు లాగారు. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 25 మంది విద్యార్థులుండగా.. ఎవరికీ ఎలాంటి అపాయం జరగకపోవటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఇవీ చూడండి..