ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'తపాలా'లో సైనికులకు రాఖీ.. తొలిసారిగా తెలంగాణ సర్కిల్‌ సేవలు

By

Published : Jul 30, 2022, 4:13 PM IST

'తపాలా'లో సైనికులకు రాఖీ..

Raksha Bandhan: సైన్యంలో ఉన్న తమ సోదరులకు రాఖీలను పంపించేందుకు తెలంగాణ తపాలా సర్కిల్​ తొలిసారిగా అవకాశం కల్పించింది. తెలంగాణ ప్రాంతంలోని 6,214 తపాలా కార్యాలయాల నుంచి ఈ సేవలు పొందవచ్చని పేర్కొంది. ఆగస్టు 10 వరకూ ఈ సేవలు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేసింది.

Raksha Bandhan :తపాలా శాఖ ద్వారా రాఖీలను పంపించడం ఎప్పటి నుంచో ఉన్నదైనా.. తొలిసారిగా సైన్యంలో ఉన్న సోదరులకు పంపించేందుకు తెలంగాణ తపాలా సర్కిల్‌ అవకాశం కల్పించింది. కేవలం రూ.41లు చెల్లించి ఈ సేవలను పొందవచ్చని పేర్కొంది. జవాన్‌/సోల్డియర్‌, కేరాఫ్‌ 1సీబీపీవో, దిల్లీ చిరునామాకు పంపిస్తే.. వారికి ఉన్న కోడ్‌ ఆధారంగా సరిహద్దుల్లో ఉన్న సైనికులకు రాఖీలు వెళ్తాయని తెలంగాణ చీఫ్‌ పోస్టు మాస్టర్‌ జనరల్‌ కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది.

తెలంగాణ ప్రాంతంలోని 6,214 తపాలా కార్యాలయాల నుంచి ఈ సేవలు పొందవచ్చు. భద్రతా కారణాల దృష్ట్యా పంపించేవారి చిరునామా కవర్‌పై రాయకూడదని నిబంధన పెట్టింది. కవర్‌పై రక్షాబంధన్‌ అని మాత్రమే రాసి పంపాలని పేర్కొంది. ఆగస్టు 10 వరకూ రాఖీలను ఇలా పంపించవచ్చని సూచించింది.

ఇవీ చూడండి..

ABOUT THE AUTHOR

...view details