ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'నాటి ప్రాజెక్టులకే పేర్లు మార్చి అనుమతులు ఇవ్వటమేంటి?'

By

Published : Apr 23, 2020, 5:06 PM IST

నదుల అనుసంధానాన్ని నిజం చేసి చూపిన వ్యక్తి తెదేపా అధినేత చంద్రబాబు అని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కొనియాడారు. నాడు తెదేపా హయాంలో చేపట్టిన గోదావరి - పెన్నా అనుసంధానంపై విమర్శలు చేసిన వైకాపా నేతలు.. ఇవాళ పేర్లు మార్చి ప్రాజెక్టు పనులకు ఎలా అనుమతులు ఇస్తున్నారని ప్రశ్నించారు.

nara lokesh
nara lokesh

నారా లోకేశ్ ట్వీట్

దేశంలోనే కలగా మిగిలిపోయిన, నదుల అనుసంధానాన్ని తెదేపా అధినేత చంద్రబాబు నిజం చేసి చూపించారని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ గుర్తు చేశారు. పట్టిసీమ ద్వారా గోదావరి - కృష్ణా నదులను కలిపారని అన్నారు. అదే స్ఫూర్తితో గోదావరి, పెన్నా నదులను అనుసంధానం చేసి, సాగర్ ఆయకట్టుకి నీరు ఇవ్వాలని తలచారని చెప్పారు. అందులో భాగంగానే గోదావరి - పెన్నా అనుసంధానం తొలి దశ పనులు కూడా మొదలు పెట్టారని పేర్కొన్నారు.

2017లో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేశారని... 2018లో మొదటి దశ పనులు కూడా ప్రారంభించారని గుర్తు చేశారు. ఆ రోజు ఇదో పెద్ద స్కాం అని వైకాపా నేతలు మాట్లాడిన తీరుని వివరించారు. ఈ రోజు అదే ప్రాజెక్టు పేరు మార్చి.. వైఎస్​ఆర్ పల్నాడు కరువు నివారణ పథకంగా రూ.6020 కోట్లతో అనుమతలు ఇవ్వటాన్ని ఏమంటారని ప్రశ్నించారు.

ABOUT THE AUTHOR

...view details