ఆంధ్రప్రదేశ్

andhra pradesh

హైదరాబాద్​లో రేపు గణేశ్‌ శోభాయాత్ర.. పోలీసుల డేగకన్ను

By

Published : Sep 8, 2022, 6:08 PM IST

Updated : Sep 8, 2022, 6:52 PM IST

Ganesh
Ganesh

GANESH IMMERSION ARRANGEMENTS: హైదరాబాద్‌లో రేపటి గణేశ్‌ శోభాయాత్రకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు అధికారులు. హుస్సేన్​సాగర్ పరిసర ప్రాంతాల్లో 12వేల మంది పోలీసులతో పటిష్ఠ భద్రత ఏర్పాటు చేయగా, పాతబస్తీలో ఇటీవల అల్లర్ల నేపథ్యంలో అదనపు బలగాలను రంగంలోకి దించనున్నారు. పూర్తి వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని నగర కమిషనర్‌ సీవీ ఆనంద్‌ కమాండ్ కంట్రోల్‌ సెంటర్ నుంచి పర్యవేక్షించనున్నారు.

GANESH IMMERSION ARRANGEMENTS: హైదరాబాద్​లో గణేశ్​ నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. హుస్సేన్​సాగర్ చూట్టూ నిమజ్జనం నిమిత్తం 22 క్రేన్లను ఏర్పాటు చేశారు. అనంతరం వ్యర్థాల వెలికితీతకు మరో 20 జేసీబీలను అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. సాగర్‌ పరిసర ప్రాంతాలలో 12వేల మంది పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. శోభాయాత్ర మార్గంలో అత్యవసర సహాయ కేంద్రాలు , వైద్యశిబిరాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.

శోభాయాత్ర సందర్భంగా పాతబస్తీలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టారు. దాదాపు 2500మంది పోలీసులతో భద్రత కల్పించనున్నట్లు తెలిపారు. షా అలీ బండ, అలియాబాద్, లాల్‌దర్వాజ, ఫలక్‌నుమా, నాగుల్‌ చింత, చాంద్రాయణగుట్ట, హుస్సేనీ ఆలం లాంటి సున్నిత ప్రాంతాల్లో అదనపు బలగాలను కేటాయించారు. ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే తక్షణ అవసరంగా మరిన్ని బలగాల్ని అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు.

హైదరాబాద్ శివారు ప్రాంతాలలో నిమజ్జనం ప్రశాతంగా జరిగేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఘట్​కేసర్ మండలం ఎదులాబాద్ లక్ష్మీనారాయణ చెరువు వద్ద నిమజ్జన నిమిత్తం రెండు క్రేన్లను ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూమ్​తో పాటు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఉప్పల్ నల్ల చెరువు వద్ద చిన్నపాటి విగ్రహాల నిమజ్జనం కోసం కొలనులు నిర్మించారు. అదేవిధంగా కార్వాన్ నియోజకవర్గ పరిధిలోని జియాగూడ , నిక్నంపూర్ ప్రాంతాలలో నిమజ్జన నిమిత్తం తాత్కాలిక కొలనులు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.

ఇవీ చదవండి:

Last Updated :Sep 8, 2022, 6:52 PM IST

ABOUT THE AUTHOR

...view details