BJP Bheem Deeksha : తెలంగాణ సీఎం కేసీఆర్ కల్వకుంట్ల రాజ్యాంగాన్ని తేవాలని కుట్ర చేస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. రాజ్యాంగాన్ని మార్చాలని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా దిల్లీ తెలంగాణభవన్ వద్ద బీజేపీ భీం దీక్ష పేరుతో పేరుతో గంటన్నరపాటు దీక్ష చేపట్టారు. భాజపా ఎంపీలు అర్వింద్, బాపూరావు సహా నేతలు పాల్గొన్నారు. తన దోపిడీని వ్యవస్థీకృతం చేసుకోవడానికే కొత్త రాజ్యాంగం తేవాలని కేసీఆర్ భావిస్తున్నారని బండి సంజయ్ మండిపడ్డారు. కల్వకుంట్ల కుటుంబపాలనను భరించేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరని బండి స్పష్టంచేశారు.
Bandi Sanjay Comments ON KCR : 'ఒక సామాన్యుడు ప్రధాని అయ్యారంటే, అది అంబేడ్కర్ భిక్షే. అంబేడ్కర్ను సగౌరవంగా సత్కరిస్తున్న ప్రభుత్వం మాది. ఆయన రాసిన రాజ్యాంగం వద్దని కేసీఆర్ అంటున్నారు. కల్వకుంట్ల రాజ్యాంగం అమలు చేస్తానన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేయకపోవడానికి కారణం ఇదే. అంబేడ్కర్ స్థానంలో తన విగ్రహం పెట్టుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారు.'
- బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు
రాజ్యాంగాన్ని అవమానించారు..
Bandi Sanjay Comments on CM KCR : మరోవైపు.. హైదరాబాద్ నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో పార్టీ నేతలు కూడా భాజపా భీం దీక్ష చేపట్టారు. అంబేడ్కర్ చిత్రపటానికి నివాళులు అర్పించి దీక్షలో కూర్చున్నారు. భాజపా ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షుడు లక్ష్మణ్ నేతృత్వంలో భీమ్ దీక్షలో ఎమ్మెల్యే రాజాసింగ్, పార్టీ నేతలు పొంగులేటి సుధాకర్ రెడ్డి, ప్రేమేందర్ రెడ్డి, తుల ఉమ పాల్గొన్నారు. సాయంత్రం 4గంటల వరకు భాజపా భీం దీక్ష కొనసాగనుంది. ఎంతో ముందు చూపుతో అంబేడ్కర్ రాజ్యాంగాన్ని రచించారన్న లక్ష్మణ్.. అంబేడ్కర్ను, రాజ్యాంగాన్ని సీఎం కేసీఆర్ అవమానించారని ఆరోపించారు.