రాష్ట్రంలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 31,987 మంది నమూనాలు పరీక్షించగా.. కొత్తగా 264 కొవిడ్ కేసులు(Andhra Pradesh corona cases update) నమోదయ్యాయి. వైరస్ బారినపడి కృష్ణా జిల్లాలో ఒకరు మృతి చెందారు. 247 మంది కొవిడ్ బారి నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2,175 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులిటెన్లో తెలిపింది.