ఆంధ్రప్రదేశ్

andhra pradesh

AP TOP NEWS: ప్రధాన వార్తలు @ 11 AM

By

Published : Aug 1, 2022, 10:58 AM IST

Updated : Aug 1, 2022, 12:03 PM IST

11AM TOP NEWS

..

  • విశాఖ రుషికొండ కూడలి వద్ద సీపీఐ నేతలను అడ్డుకున్న పోలీసులు
    Police stopped CPI leaders: విశాఖ రుషికొండ కూడలి వద్ద సీపీఐ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. రుషికొండ వద్ద హరిత రిసార్ట్ నిర్మాణ స్థలం పరిశీలనకు వెళ్తుండగా సీపీఐ నేత నారాయణ సహా పలువురు నేతలను పోలీసులు అడ్డగించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఎమ్మెల్యే అనుచరులు వీరంగం.. రిపోర్టర్‌ సెల్‌ఫోన్‌ లాక్కొని..
    MLA fallowers: చిత్తూరు జిల్లా పలమనేరు మండలంలోని కాపుపల్లె గ్రామంలో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే వెంకటేగౌడ అనుచరులు వీరంగం సృష్టించారు. వార్తా సేకరణకు వెళ్లిన రిపోర్టర్‌ సెల్‌ఫోన్‌ లాక్కున్నారు. ఎమ్మెల్యే అభిమానుల పేరిట 20 మంది హంగామా సృష్టించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • TDP MLA as a paperboy: పేపర్‌బాయ్‌ అవతారమెత్తిన తెదేపా ఎమ్మెల్యే..
    TDP MLA as a paperboy: టిడ్కో ఇళ్ల పంపిణీ జాప్యాన్ని నిరసిస్తూ తెదేపా ఎమ్మెల్యే.. పేపర్‌బాయ్‌ అవతారమెత్తారు. వేకువజామునే పట్టణంలోని మావుళ్లమ్మపేటకు చేరుకున్న ఆయన స్థానిక పేపర్‌బాయ్స్‌తో కలిసి వాటిని చందాదారులకు పంపిణీ చేసేందుకు సమాయత్తమయ్యారు. ఇంతకీ ఆయన ఎవరంటే..? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • Casino: నేడు ఈడీ ముందుకు చీకోటి బృందం.. హవాలా లెక్క తేలేనా?
    క్యాసినో కేసులో నేడు ఈడీ ముందుకు చీకోటి ప్రవీణ్‌ బృందం రానుంది. ఇప్పటికే ప్రవీణ్‌, మాధవరెడ్డి నివాసాల్లో సోదాలు జరిపిన అధికారులు... ల్యాప్‌టాప్‌లు, ఇతరదస్త్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఈడీ విచారణలో మరిన్ని కీలక విషయాలు వెలుగుచూసే అవకాశముంది. విదేశాల్లో క్యాసినో క్యాంపులకు వందలమంది పంటర్లను తరలించినట్టు ఆధారాలు సేకరించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • భారత్​లో భారీగా తగ్గిన కొవిడ్ కేసులు.. జపాన్​లో 2లక్షలపైనే!
    Covid Cases In India: భారత్​లో కొవిడ్​ కేసులు భారీగా తగ్గాయి. తాజాగా 16,464 మంది వైరస్ బారిన పడగా.. 39 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు జపాన్​లో కొత్తగా 2.12 లక్షలకు పైగా కొవిడ్ కేసులు నమోదయ్యాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ముష్కరుల తూటాలకు బెదరని శునకం.. విధి నిర్వహణలో ప్రాణ త్యాగం
    ఉగ్రవాదిని ఆచూకీ కనిపెట్టడంలో కీలకంగా వ్యవహరించి, విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అక్సెల్ అనే శునకానికి ఆర్మీ అంత్యక్రియలు నిర్వహించింది. ఈ ఘటన జమ్ముకశ్మీర్​లో జరిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఒక్కరికే మళ్లీ మళ్లీ వస్తున్న కరోనా.. ఆ జౌషధమే​ కారణమా?
    Paxlovid Medicine: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కొన్ని రోజుల క్రితం కొవిడ్ బారినపడ్డారు. అయితే ఆయనకు నాలుగు రోజుల్లోనే నెగెటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. మళ్లీ టెస్ట్ చేయగా పాజిటివ్​గా తేలింది. ఈ నేపథ్యంలో అందరి దృష్టి జో బైడెన్​కు చికిత్స అందించడంలో ఉపయోగించిన 'పాక్స్‌లవిడ్‌' అనే ఔషధంపైకి మళ్లింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • గుడ్ న్యూస్.. వంట గ్యాస్​ ధర తగ్గింపు.. ఎంతంటే...
    LPG price cut news: వంట గ్యాస్ ధర స్వల్పంగా తగ్గింది. 19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను సోమవారం నుంచి రూ.36 మేర తగ్గిస్తున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'గోల్డ్​ గెలిచేశావ్​గా.. ఇప్పుడు దర్జాగా సినిమా చూసుకో అచింత!'.. మోదీ ట్వీట్​
    Achinta Modi Tweet: కామన్వెల్త్​ గేమ్స్ వెయిట్​ లిఫ్టింగ్​ విభాగంలో భారత్​కు మూడో బంగారు పతకాన్ని అందించిన అచింతకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రపతి ముర్ము సహా ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. 'అనుకున్న మెడల్​ గెలిచేశావుగా.. ఇప్పుడు దర్జాగా వెళ్లి మూవీ చూడు' అంటూ అచింతకు మోదీ స్పెషల్​ విషెస్​ తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • స్టార్​హీరోకు బెదిరింపులు.. గన్​లైసెన్స్​ మంజూరు చేసిన పోలీసులు
    Salman khan weapon license: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్​ ఖాన్​కు తుపాకీ లైసెన్స్​ మంజూరు అయింది. ఈ విషయాన్ని ముంబయి పోలీసులు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
Last Updated :Aug 1, 2022, 12:03 PM IST

ABOUT THE AUTHOR

...view details