ఆంధ్రప్రదేశ్

andhra pradesh

నామినేషన్‌ దాఖలు చేసిన నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి - భారీగా తరలివచ్చిన కార్యకర్తలు - Kiran Kumar Reddy Nomination

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 24, 2024, 6:16 PM IST

Nallari_Kiran_Kumar _Reddy_Nomination_in_Rajampet_Lok_Sabha_Constituency

Nallari Kiran Kumar Reddy Nomination in Rajampet Lok Sabha Constituency : అన్నమయ్య జిల్లా రాజంపేట లోక్‌సభ ఎన్డీయే కూటమి అభ్యర్థి నల్లారి కిరణ్‌ కుమార్‌రెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు. పెద్దసంఖ్యలో కార్యకర్తలతో ర్యాలీగా వెళ్లి రిటర్నింగ్‌ అధికారికి నామపత్రాలు సమర్పించారు. జిల్లాలోని వివిధ నియోజకవర్గాల నుంచి వచ్చిన టీడీపీ, బీజేపీ, జనసేన కార్యకర్తల మధ్య ఆయన నామినేషన్ అట్టహాసంగా దాఖలు చేశారు. అనంతరం రాయచోటి టీడీపీ అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డితో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రజలకు అభివాదం చేస్తూ ఆయన ర్యాలీలో పాల్కొన్నారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడుల నాయకత్వం ఎంతో అవసరమని తెలిపారు. ప్రజలు ఆలోచించి ఓటును వినియోగించుకోవాలన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో ఇసుక, మట్టి, భూములను వైసీపీ ప్రభుత్వంలో దోచేశారని విమర్శించారు. రాష్ట్రాన్ని మళ్లీ గాడిలో పెట్టాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. వైఎస్సార్సీపీ నాయకులు పెట్టే ప్రలోభాలకులోను కాకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని నల్లారి కిరణ్‌ కుమార్‌రెడ్డి కోరారు.

ABOUT THE AUTHOR

...view details