ఆంధ్రప్రదేశ్

andhra pradesh

సాక్షి సర్క్యులేషన్‌ గణాంకాలను ప్రచురించొద్దు- దిల్లీ హైకోర్టు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 15, 2024, 11:44 AM IST

Delhi High Court Order Dont  Publish Sakshi Circulation Statistics: వాలంటీర్లు సాక్షి దినపత్రికను (Sakshi News Paper) కొనుగోలు చేయడాన్ని రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరి చేసిన వ్యవహారంలో ఢిల్లీ హైకోర్టు గురువారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. 2023 జులై- డిసెంబరు మధ్య కాలానికి సంబంధించి సాక్షి పత్రిక సర్క్యులేషన్ గణాంకాలు, డేటాను ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ (ఏబీసీ) ప్రచురించకుండా తాత్కాలిక స్టే విధించింది.

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి పత్రికను వాలంటీర్లు(Volunteer) కొనుగోలు చేయడం తప్పనిసరి చేసేలా, తద్వారా ప్రభుత్వ నిధులు ప్రైవేటు సంస్థ అయిన సాక్షికి మళ్లేలా అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబరు 12, 25లను జారీ చేసిందంటూ ఈనాడు (పిటిషనర్) తరఫు సీనియర్ న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. ఆ వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం తదుపరి విచారణ జరిగేంత వరకు సాక్షి పత్రిక సర్క్యులేషన్ గణాంకాలను విడుదల చేయొద్దని ఏబీసీని ఆదేశించింది. సర్క్యులేషన్ వివరాలను తమకు సీల్డ్ కవరులో అందజేయాలని సూచించింది. విచారణను ఈ నెల 27వ తేదీకి వాయిదా వేసింది.

ABOUT THE AUTHOR

...view details