ఆంధ్రప్రదేశ్

andhra pradesh

LIVE కర్నూలు జిల్లా మంత్రాలయం ప్రజాగళం సభలో చంద్రబాబు- ప్రత్యక్షప్రసారం - Chandrababu Prajagalam Sabha

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 28, 2024, 5:14 PM IST

Updated : Apr 28, 2024, 6:14 PM IST

Chandrababu Prajagalam Sabha Live: తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. నేడు నెల్లూరు, ఉమ్మడి కర్నూలు జిల్లాల్లో చంద్రబాబు పర్యటిస్తున్నారు. నెల్లూరులో మైనార్టీలతో చంద్రబాబు ముఖాముఖిలో పాల్గొన్నారు. కర్నూలు జిల్లాలో సైతం నేడు చంద్రబాబు పర్యటన జరగనుంది. సాయంత్రం 4 గం.కు కౌతాళం సభలో పాల్గొని చంద్రబాబు ప్రసంగిస్తారు. రాత్రికి కోడుమూరు మం. గూడూరు సభలో పాల్గొననున్నారు. సోమవారం నంద్యాల జిల్లాలో పర్యటించనున్నారు. సోమవారం సాయంత్రం డోన్‌లో, రాత్రికి నందికొట్కూరులో చంద్రబాబు పర్యటన కొనసాగునుంది. ఇప్పటికే ప్రజాగళం- వారాహి విజయోత్సవ సభలు విజయవంతంగా నిర్వహించిన చంద్రబాబు- పవన్‌ కల్యాణ్​లకు తోడుగా ప్రధాని నరేంద్ర మోదీ ఇతర బీజేపీ జాతీయ నేతలు త్వరలో జతకట్టనున్నారు. నాలుగు బహిరంగ సభల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొననున్నారు. అనకాపల్లి, రాజమండ్రి, కడప లేదా రాజంపేటల్లో ఒకటి, మరోచోట బహిరంగ సభల్లో ప్రధాని మోదీ, తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ కలిసి పాల్గొనేలా కూటమి ప్రణాళిక సిద్ధమవుతోంది. ఈలోగా చంద్రబాబు- పవన్ కల్యాణ్ వీలైనన్ని ఎక్కువ సభల్లో ఉమ్మడి ప్రచారం చేయనున్నారు. ప్రస్తుతం కర్నూలు జిల్లాలోని మంత్రాలయంలో ప్రజాగళం సభలో పాల్గొన్న చంద్రబాబు ప్రత్యక్షప్రసారం మీకోసం. 
Last Updated :Apr 28, 2024, 6:14 PM IST

ABOUT THE AUTHOR

...view details