ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Live కుప్పం యువతతో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సమావేశం- ప్రత్యక్ష ప్రసారం - CBN Meeting with Youth

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 26, 2024, 3:23 PM IST

Updated : Mar 26, 2024, 4:42 PM IST

CTR CBN Meeting with Youth LIve
CBN Meeting with Youth Live : తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు  కుప్పం పట్టణంలో చంద్రబాబు ఇంటింటి ప్రచారం  చేస్తున్నారు ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్నారు.ప్రజల నుంచి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. నేడు కుప్పంలో రెండో రోజు పర్యటిస్తున్నారు. ఉదయం కుప్పం ఆర్‍అండ్‍బీ అతిథిగృహంలో ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు. మధ్యాహ్నం కుప్పం టీడీపీ కార్యాలయంలో నేతలతో భేటీ అవుతారు. సాయంత్రం హంద్రీనీవా కాలువ పరిశీలించనున్న చంద్రబాబు, రాత్రి ఆర్‍అండ్‍బీ అతిథి గృహంలో బస చేయనున్నారు. మరోవైపు ఈ నెల 27 తేదీ నుంచి చంద్రబాబు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ప్రజాగళం పేరుతో అధినేత ఎన్నికల ప్రచారం, సభలు, రోడ్ షోలు నిర్వహించనున్నారు. రోజుకు 3 నుంచి 4 నియోజకవర్గాల్లో సభలు, రోడ్ షోలు సాగేలా ప్రణాళిక రూపోందించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రజాగళం పేరుతో ఈనెల 27వ తేదీ నుంచి 31 తేదీ వరకు వరుస పర్యటనలు చేయనున్నారు. 27వ తేదీన పలమనేరు, నగిరి, నెల్లూరు రూరల్​లలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. 28న రాప్తాడు, సింగనమల, కదిరిలో పర్యటించనున్నారు. 29వ తేదీ శ్రీశైలం, నందికొట్కూరు, కర్నూలు, 30వ తేదీన మైదుకూరు, ప్రొద్దుటూరు, సూళ్లూరిపేట, శ్రీకాళహస్తిలలో చంద్రబాబు ప్రచారంలో పాల్గొననున్నారు. 31వ తేదీన కావలి, మార్కాపురం, సంతనూతల పాడు, ఒంగోలులలో చంద్రబాబు పర్యటనలు ఉండనున్నాయి. సొంత నియోజకవర్గం కుప్పంలో రెండో రోజు చంద్రబాబు పర్యటిస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారం.  
Last Updated :Mar 26, 2024, 4:42 PM IST

ABOUT THE AUTHOR

...view details