ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పెళ్లి బృందంతో వెళ్తున్న ట్రాక్టర్‌ బోల్తా - ముగ్గురు మృతి - ఆగిన పెళ్లి - Three People Died in Accident

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 27, 2024, 10:32 PM IST

Updated : Mar 28, 2024, 10:29 AM IST

Three People Died in Accident in Sangareddy District : తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పెళ్లి బృందంతో వెళ్తున్న ట్రాక్టర్‌ బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా, మరో 24 మందికి గాయాలయ్యాయి. అందులో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. మరోవైపు ప్రమాదంతో పెళ్లి ఆగింది. దీంతో వరుడి తాత ఆత్మహత్య చేసుకున్నాడు.

Three People Died in Accident
Three People Died in Accident

Three People Died in Accident in Sangareddy District : తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పెళ్లి కూతురిని తీసుకొని వెళ్లడానికి వచ్చిన ట్రాక్టర్ బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా చికిత్స పొందుతూ మరొకరు చనిపోయారు. 20 మందికి గాయాలయ్యాయి. వారిలో నలుగురికి పరిస్థితి విషమంగా ఉంది. ఈ విషాద ఘటన సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం మన్సాన్పల్లి గ్రామ శివారులో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే మెదక్ జిల్లా పాపన్నపేట మండలం బాచారం గ్రామానికి చెందిన రమేశ్​కు అందోల్ గ్రామానికి చెందిన మమతతో పెళ్లి నిశ్చయమైంది. ఈనెల 28న వివాహం ఉండడంతో బుధవారం వధువుని తీసుకొని రావడానికి పాచారం నుంచి పెళ్లి కుమారుడికి సంబంధించిన 29 మంది బంధువులు ఓ ట్రాక్టర్​లో బయలుదేరారు.

Road Accident in Andole Mandal : అందోల్ మండలం మన్సాన్పల్లి గ్రామ శివారులోని మలుపు వద్దకు రాగానే ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో భూదమ్మ (52), సంగమ్మ (46), అక్కడికక్కడే మృతి చెందగా ఆశమ్మ చికిత్స పొందుతూ చనిపోయారు. ఈ ఘటనలో 24 మంది మహిళలకు గాయాలయ్యాయి. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను వెంటనే 108 వాహనాల్లో జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స అనంతరం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు జోగిపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గురువారం పెళ్లి కార్యక్రమం జరగనుండగా బంధువుల రాక, హడావిడితో సందడిగా ఉన్న ఇంటిలో ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.

పెళ్లి ఇంట విషాదం - కుమారుడి పెళ్లికి ఆహ్వానించేందుకు వెళ్తుండగా ప్రమాదం - Road Accident

మరో విషాదం : పెళ్లింట మరో విషాదం నెలకొంది. బుధవారం జరిగిన ప్రమాదంలో ముగ్గురు మృతి చెందడంతో గురువారం జరగాల్సిన పెళ్లి నిలిచిపోయింది. పెళ్లి ఆగిపోయిందనే మనస్తాపంతో వరుడి తాత పెంటయ్య ఆత్మహత్య చేసుకున్నాడు.

వైఎస్సార్‌ జిల్లాలో విషాదం - ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య - Three People Commit Suicide

Last Updated :Mar 28, 2024, 10:29 AM IST

ABOUT THE AUTHOR

...view details