Political Heirs in AP Elections : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ వారసులు ఎంతో మంది బరిలో నిలిచారు. అయితే, వారిలో మాజీ ముఖ్యమంత్రుల వారసులు ఎనిమిది మంది ఉన్నారు. ఆరుగురు కూమారులు అసెంబ్లీకి, ఇద్దరు కుమార్తెలు లోక్సభ అభ్యర్థులుగా కాంగ్రెస్, బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రెండుసార్లు ఎన్నికైన వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడు, ప్రస్తుత సీఎం జగన్ పులివెందుల అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లోనూ జగన్ పులివెందులలో గెలుపొందారు.
ఉత్తరాంధ్రలో 'కీ'లకం - విజయనగరం విజేత ఎవరో? - Vizianagaram Lok Sabha Elections
ఐటీ మాస్టర్, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కుమారుడు లోకేశ్ మంగళగిరి అసెంబ్లీ బరిలో నిలిచారు. మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు మనుమడు అయిన లోకేశ్ గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రిగానూ పని చేశారు.
మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు కుమారుడు, ప్రముఖ సినీ నటుడు బాలకృష్ణ హిందూపురం అసెంబ్లీ స్థానం నుంచి మళ్లీ పోటీ చేస్తున్నారు. ఇదే స్థానం నుంచి 2014, 2019 ఎన్నికల్లో వరసగా రెండుసార్లు విజయం సాధించిన బాలకృష్ణ హ్యాట్రిక్ విజయాలపై కన్నేశారు. ఆయన సోదరుడు నందమూరి హరికృష్ణ గతంలో హిందూపురం ఎమ్మెల్యేగా విజయం సాధించడం విశేషం.
హిందూపురంలో బీసీ ఓటర్లే బలం - సైకిల్ జైత్రయాత్ర సాగించిన ఎన్టీఆర్ - Hindupur LOK SABHA ELECTIONS
జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తెనాలి నుంచి పోటీకి దిగారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కొన్నాళ్లపాటు ముఖ్యమంత్రిగా పని చేసిన నాదెండ్ల భాస్కరావుకు కుమారుడైన మనోహర్ గతంలోనూ ఇక్కడి నుంచే రెండుసార్లు ఎన్నికయ్యారు. అసెంబ్లీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్గానూ వ్యవహారాలు చక్కబెట్టారు. నాదెండ్ల భాస్కరరావు సైతం 1989లో ఇదే తెనాలి నుంచి పోటీ చేసి విజయం సాధించారు.