ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ప్రభుత్వ ఉద్యోగులు, వాలంటీర్లపై కొరడా ఝుళిపించిన ఎన్నికల సంఘం - AP Volunteers campaigning For YSRCP

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 23, 2024, 10:24 AM IST

Volunteers campaigning For YSRCP: వైఎస్సార్సీపీ తరఫున ప్రచారంలో పాల్గొంటున్న ప్రభుత్వ ఉద్యోగులు, వాలంటీర్లపై ఎన్నికల సంఘం కొరడా ఘుళిపించింది. నిబంధనలు అతిక్రమించి అధికార పార్టీతో అంటగాగుతున్న ఘటనలపై ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేశాయి. ఈ నేపథ్యంలో వాలంటీర్లు, ప్రభుత్వ ఉద్యోగులు కాంట్రాక్ట్ ఉద్యోగులను విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Volunteers campaigning For YSRCP
Volunteers campaigning For YSRCP

Volunteers campaigning For YSRCP:ఎన్నికల సంఘం ఆదేశాలను బేఖాతరు చేస్తూ ప్రభుత్వ ఉద్యోగులు, వాలంటీర్లు వైఎస్సార్సీపీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఆయా అభ్యర్థుల తరఫున ప్రచారంలో పాల్గొన్న వాలంటీర్లు, ఉద్యోగులపై ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. ఈ నేపథ్యంలో నిబంధనలు అతిక్రమించిన ప్రభుత్వ అధికారులు, కాంట్రాక్ట్ ఉద్యోగులతో పాటుగా వాలంటీర్లపై ఈసీ కొరడా ఝుళిపించింది.

ఇద్దరు ఔట్సోర్సింగ్ ఉద్యోగులపై వేటు: ఎన్నికల సంఘం ఆదేశాలను పట్టించుకోకుండా వైఎస్సార్సీపీ అభ్యర్థుల తరఫున ప్రచారంలో పాల్గొన్న పలువురు వాలంటీర్లు, అధికారులను సస్పెండ్ చేస్తూ ఎన్నికల అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. గుంటూరులో అధికారపార్టీ అభ్యర్థుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న 12 మంది వాలంటీర్లను విధుల నుంచి తొలగిస్తూ నగరపాలక సంస్థ కమిషనర్ కీర్తి చేకూరి ఉత్తర్వులు జారీ చేశారు. ఓ ముఖ్య ప్రజాప్రతినిధి వద్ద పనిచేస్తున్న ఇద్దరు ఔట్సోర్సింగ్ ఉద్యోగులను విధుల నుంచి తొలగించినట్లు కమిషనర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

వాట్సాప్ గ్రూపులో పోస్టులు: ప్రకాశం జిల్లా మార్కాపురంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి అన్నా రాంబాబు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఉపాధిహామీ పథకం టెక్నికల్ అసిస్టెంట్ కుందురు అనిల్ కుమార్ రెడ్డిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. కర్నూలు జిల్లా ఆదోనిలో అధికారపార్టీకు మద్దతుగా వాలంటీర్ రవి వాట్సాప్ గ్రూపులో పోస్టు చేశాడు. బీజేపీ నాయకుడు నాగరాజు ఫిర్యాదుతో అధికారులు అతన్ని విధులు నుంచి తొలగించారు.
ఈసీ ఆదేశాలను బేఖాతరు చేస్తూ కోడ్ ఉల్లంఘనలు- దేవాలయాలనూ వదలని వైసీపీ నేతలు - Volunteers Election Code Violation

నాయకుల మధ్య వాగ్వాదం: విశాఖ పార్లమెంట్ అభ్యర్థిని బొత్స ఝాన్సీ పాల్గొన్న ఎన్నికల ప్రచారంలో స్థానిక ముఖ్య నాయకులు మొహం చాటేశారు. నిబంధనలు అతిక్రమించి వాలంటీర్లు ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా పరవాడ మండలానికి చెందిన 40 మంది వాలంటీర్లతో వైఎస్సార్సీపీ కార్పొరేటర్ సూర్యకుమారి దేశపాత్రునిపాలెంలో సమావేశం నిర్వహించారు. విషయం తెలుసుకున్న జనసేన, టీడీపీ నాయకులు అక్కడికి వెళ్లి వారిని నిలదీయంటంతో ఇరువర్గాల నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో అక్కడినుంచి వాలంటీర్లు, కార్పొరేటర్ జారుకున్నారు.

ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు: వైఎస్ఆర్ కడప జిల్లా తుమ్మలూరు గ్రామంలోఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి కుమార్తె రమ్యత రెడ్డి నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో వాలంటీర్, ఫీల్డ్ అసిస్టెంట్ శివారెడ్డి పాల్గొనంపై టీడీపీ మండల కన్వీనర్ గంగిరెడ్డి స్థానిక ఎంపీడీవోకు, ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా ఆర్.అనంతపురం గ్రామంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి ఈరలక్కప్ప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వాలంటీర్ రామకృష్ణ,ప్రభుత్వ సిబ్బందిపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు కోరుతున్నాయి.

ఎన్నికల ప్రచారంలో వాలంటీర్లు- ఈసీ ఆదేశాలను లెక్కచేయని వైఎస్సార్సీపీ

ABOUT THE AUTHOR

...view details